BC Reservations : ఎమ్మెల్సీ కవితకు ఆర్ కృష్ణయ్య సంపూర్ణ మద్ధతు..దేనికోసమంటే.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమం కీలక మలుపు తిరిగింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జూలై 17న చేపట్టనున్న రైల్ రోకోకు సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. 

New Update
BC Reservations

BC Reservations

BC Reservations :  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమం కీలక మలుపు తిరిగింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జూలై 17న రైల్‌రోకో చేస్తామని కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ జాగృతి,  యునైటెడ్ ఫూలే ఫ్రంట్ సంయుక్తంగా జూలై 17న తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమానికి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. 

Also Read: Ananya Nagalla : కేరవాన్‌లో ఏడ్చేదాన్ని..  తెలుగు హీరోయిన్లను తొక్కేస్తున్నారు : అనన్య నాగళ్ల

ఈ మేరకు విద్యానగర్‌లోని ఆర్‌.కృష్ణయ్య నివాసంలో ఆదివారం ఆయనతో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కల్పించడానికి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించడం కోసం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడానికి చేపడుతున్న  రైల్ రోకోకు మద్ధతివ్వాలని కవిత కోరారు.  దానికి స్పందించిన ఆర్‌. కృష్ణయ్య రైల్ రోకో కార్యక్రమంతో సహా ప్రతీ కార్యక్రమానికి తాము అండగా ఉంటామని ప్రకటించారు. బీసీలంతా ఎమ్మెల్సీ కవిత ఉద్యమంలో భాగస్వాములు కావాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు.

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌
 
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కోసం రెండేళ్లుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామన్నారు. ముఖ్యంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం చేసిన పోరాట ఫలితంగా2 బిల్లులను అసెంబ్లీ ఆమోదించిందని తెలిపారు. రాజ్యాంగంలోని 243(డీ) ప్రకారం ఒక జీవో ఇచ్చి 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేయడం లేదని ఆరోపించారు. పైగా ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై తోసేసి రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లే  ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలనే డిమాండ్‌తో  రైల్ రోకో చేపడుతున్నామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.  

Also Read :  బేగంపేటలో భారీ చోరీ..ఏకంగా రూ.48లక్షలు కాజేసి..

ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.... స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లీస్తోందని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు.  42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ది ఉంటే జీవో జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు తీరని ద్రోహం చేసినట్లు అన్నారు.  రిజర్వేషన్లు పెంచకపోతే బీసీలు తెలంగాణ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, స్థానిక ఎన్నికలు జరపాలని, లేదంటే పెద్ద యుద్ధమే జరుగుతుందని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.  

ఇది కూడా చదవండి: అందం పెరగాలంటే పాలను ఇలా ట్రై చేయండి.. ప్రయోజనాలన్నీ పుష్కలమే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు