Ponguleti Srinivas: ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి సంచలన ప్రకటన

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటిదాకా ఈ స్కీమ్‌ కింద 2.10 లక్షల మంది లబ్ధిదారులు ఎంపికైనట్లు పేర్కొన్నారు. జూన్‌ 10లోగా మిగతా లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందని తెలిపారు.

New Update
Ponguleti Srinivas

Ponguleti Srinivas

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటిదాకా ఈ స్కీమ్‌ కింద 2.10 లక్షల మంది లబ్ధిదారులు ఎంపికైనట్లు పేర్కొన్నారు. జూన్‌ 10లోగా మిగతా లబ్ధిదారుల జాబితా సిద్ధమవుతుందని తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 42 వేల ఇళ్లు మంజూరు చేశామని.. ఇందులో 24 వేల ఇళ్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. దాదాపు 100 ఇళ్ల వరకు ఇప్పుడు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.  

Also Read: గృహప్రవేశం రోజే బిల్డింగ్ నేలమట్టం.. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం!

'' లబ్ధిదారుల జాబితాకు సంబంధించి విపక్ష ఎమ్మెల్యేలనే 40 శాతం పేర్లు ఇవ్వమని అడిగాం. మిగతా 60 శాతం ఇందిరమ్మ కమిటీలు సెలెక్ట్ చేస్తాయి. కేటీఆర్‌ లబ్ధిదారులకు సంబంధించిన జాబితా ఇవ్వలేదు. అధికారులనే ఎంపిక చేయమన్నారు. ఐటీడీఏ పరిధిలో చెంచులకు 9200 ఇళ్లు మంజూరు చేశాం. హైదరాబాద్‌లో 16 స్లమ్స్‌లో నాలుగంతస్తుల భవనాలు కూడా నిర్మిస్తాం. వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో కూడా ఇదే తరహాలో నిర్మిస్తామని'' పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. 

Also Read: కౌంట్ డౌన్ స్టార్ట్.. మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు! రేపే ఫైనల్స్

ఇదిలాఉండగా.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో ఎమ్మెల్సీ కవితకు జరుగుతున్న వివాదం హాట్‌ టాపిక్‌గా మారింది .తాజాగా దీనిపై కూడా మంత్రి పొంగులేటి స్పందించారు. '' కవిత కాంగ్రెస్‌లోకి వస్తే మంత్రి పదవి ఇస్తారా లేదా వేరే పదవి ఇస్తారా అనేది నాకు తెలియదు. నేను పార్టీలో చిన్న కార్యకర్తను. కవిత ఎపిసోడ్‌ టీ కప్పులో తుఫాన్ లాంటింది. ఎవరో ఆడిస్తే కవిత ఆడుతున్నారు. ఆమె ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఓసారి దెయ్యం అంటోంది, మరోసారి దేవుడు అంటోంది. నాన్న మంచోడు అంటోంది. అన్న కుట్ర చేస్తున్నాడు అంటోందని'' పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.   

 rtv-news | national-news | ponguleti-srinivas

Advertisment
Advertisment
తాజా కథనాలు