Kidney Rocket: హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్‌ వ్యవహారం.. వెలుగులోకి సంచలన విషయాలు

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పరిధిలో అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్‌కేసులో మరో విషయం బయటపడింది.ఈ వ్యవహారంలో మొత్తం 8 మంది దళారులను పోలీసులు గుర్తించారు. ఈ తతంగం గత ఆరు నెలల నుంచి నడుస్తున్నట్లు పేర్కొన్నారు.

New Update
kidney Rocket Scam in Hyderabad (File Photo)

kidney Rocket Scam in Hyderabad (File Photo)

Kidney Rocket: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పరిధిలో అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్‌ స్కామ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో కీలక విషయం బయటపడింది. కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో మొత్తం 8 మంది దళారులను పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఈ తతంగం గత ఆరు నెలల నుంచి నడుస్తున్నట్లు పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన ఓ వైద్యుడు ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.  

Also Read: భార్యను కుక్కర్‌లో ఉడికించిన ఘటన.. గురుమూర్తి సెల్‌ఫోన్‌లో సంచలన విషయం

వెలుగులోకి సంచలన విషయాలు

అలాగే ఈ వైద్యుడితో పాటు మరికొంత మంది ప్రమేయం ఉందనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ కేసుకు సంబంధించి ఆస్పత్రి నిర్వాహకుడు సుమాంత్‌తో పాటు మరికొందరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉండగా..  అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఎలాంటి పర్మిషన్ లేకుండానే కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయనే విషయం పోలీసులు దృష్టికి వచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్ పోలీసులు ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అమాయకులకు డబ్బులను ఆశ చూపిస్తూ.. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వైద్యులతో కిడ్నీ మార్పిడి చికిత్సలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నట్లు విచారణలో తేలింది . 

Also Read:  ట్రంప్‌ నిర్ణయంతో అమెరికాలో హాస్పిటళ్లకు క్యూ కడుతున్న ఇండియన్స్

కర్ణాటకకు చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన ఇద్దరికీ ఈ కిడ్నీ మార్పిడి చికిత్సలు జరిగినట్లు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు కిడ్నీలు ఇవ్వగా.. వాళ్లని కర్ణాటకకు చెందిన మరో ఇద్దరికి అమర్చినట్లు పోలీసులు తేల్చారు. కిడ్నీ దాతలతో సహా.. ఇద్దరు రోగులను పోలీసులు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే 6 నెలల క్రితమే అలకనంద ఆస్పత్రి ప్రారంభమైందని పోలీసులు వెల్లడించారు. అప్పటినుంచి ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా జరిగుతుందని తెలిపారు . 

Also Read: ఐదేళ్లలో నిరుద్యోగం లేకుండా చేస్తా.. కేజ్రీవాల్ సంచలన హామీ

Also Read : Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ

Advertisment
Advertisment
తాజా కథనాలు