Hyderabad: అగ్ర దేశాలకు మన ఆయుధాలు!

రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాల చుట్టూ తిరిగిన భారత్‌ ఇప్పుడు అగ్రదేశాలకే వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దీన్ని ఎంతో ఆసక్తికర మార్పుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరం లోనే రూ.21,000కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది

New Update
weapons

weapons

రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాల చుట్టూ తిరిగిన భారత్‌ (India) ఇప్పుఉడ అగ్రదేశాలకే వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దీన్ని ఎంతో ఆసక్తికర మార్పుగా పరిశ్రమ వర్గాలు భావిస్తు్నాయి. ఒక ఆర్థిక సంవత్సరం లోనే రూ.21,000కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. 2022-23 తో పోల్చితే ఇది 32. 5 శాతం అధికం.

Also Read: Bangladesh: జైళ్ల నుండి తప్పించుకున్న 700 మంది ఖైదీలు... ఎక్కడికి వెళ్లారు?

Weapons :

మన దేశ రక్షణ ఎగుమతుల్లో దాదాపు 75 శాతం ప్రభుత్వ రంగ సంస్థల వాటా  కాగా, మిగిలినవి ప్రైవేటు కంపెనీలు చేస్తున్నాయి. కొన్నేళ్లలో రక్షణ పరికరాల ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రైవేటు సంస్థల వాటా గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇందులో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు క్రియాశీలక పాత్ర పోషించనున్నాయి.

Also Read: Suryapet Incident: సూర్యాపేటలో పరువు హత్య.. ప్రేమించాడని వెంటపడి.. రాళ్లతో కొట్టి..!

2029 నాటికి రూ. 50,000 కోట్ల విలువైన రక్షణ పరికరాలు ఎగుమతి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. మన దేశం నుంచి రక్షణ ఉత్పత్తులు, ఆయుధ సామాగ్రిని (Weapons) అధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్‌, , ఆర్మేనియా అగ్రస్థానాల్లో ఉండడం ఆసక్తికరం. అమెరికా కంపెనీలు సిస్టమ్స్‌, సబ్‌ సిస్టమ్స్‌ , విడి భాగాలు కొనుగోలు చేస్తున్నాయి. మన దేశం నుంచి ఆకాశ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ మిస్సైల్‌ సిస్టమ్స్‌ , పినాక మల్టీ -లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్స్‌ , 155 ఎంఎం ఆర్టిలరీ గన్లను ఆర్మేనియా అధికంగా కొనుగోలు చేస్తోంది.

వియత్నాం కోస్ట్‌ గార్డ్‌కు మనం ఇంటర్‌ సెప్టర్‌ బోట్లు అందిస్తున్నాం. బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ మిస్సైళ్లను కొనుగోలుకు వియత్నాం ఆసక్తిగా ఉంది. తేజస్ యుద్ధ విమానాల పై మలేషియా, బ్రెజిల్‌ వంటి దేశాలు ఆసక్తిగా ఉన్నాయి.

ప్రస్తుతం దాదాపు 100 కు పైగా దేశాలకు మన దేశం రక్షణ ఉత్పత్ఉలను ఎగుమతి చేస్తోంది. అధికంగా ఆర్డర్లు అభిస్తున్నందున , కొన్నేళ్లలో దేశీయంగా రక్షణ సంస్థల ఉత్పత్తి బాగా పెరిగింది.దాదాపు 16 ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు 430 కి పైగా ప్రైవేటు రంగ కంపెనీలు, 16,000 ఎంఎస్‌ఎంఈలు రక్షణ ఉత్పత్తుల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

Also Read: Mauni Amavasya: మౌని అమావస్య రోజు గంగలో మునిగితే పాపాలు పోతాయా? మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు

Also Read: Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

Advertisment
Advertisment
తాజా కథనాలు