Bangladesh: జైళ్ల నుండి తప్పించుకున్న 700 మంది ఖైదీలు... ఎక్కడికి వెళ్లారు?

బంగ్లాదేశ్ లో జరిగిన హింసాత్మక విద్యార్థి ఉద్యమంలో 800 మందికి పైగా ఖైదీలు దేశంలోని వివిధ జైళ్ల నుంచి తప్పించుకున్నారు.షేక్ హసీనా ప్రభుత్వం పతనమై దాదాపు ఏడు నెలలు గడిచినా వారిలో 700 మంది జాడ ఇప్పటి వరకు తెలియలేదు.

New Update
Bangladesh:

ఏడు నెలల క్రితం బంగ్లాదేశ్ లో జరిగిన హింసాత్మక విద్యార్థి ఉద్యమంలో 800 మందికి పైగా ఖైదీలు దేశంలోని వివిధ జైళ్ల నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే.షేక్ హసీనా ప్రభుత్వం పతనమై దాదాపు ఏడు నెలలు గడిచినా వారిలో 700 మంది జాడ ఇప్పటి వరకు  తెలియలేదు. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలలో చాలా మంది తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మరణశిక్ష పడిన ఖైదీలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

Also Read: Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

భారత వ్యతిరేక శక్తులు...

ఇప్పుడు ఈ ఖైదీలు ఎక్కడకి వెళ్లిపోయారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, భారత వ్యతిరేక శక్తులు అక్కడ నిరంతరం బలంగా తయారవుతున్నాయని.. భారతదేశానికి వ్యతిరేకంగా తమ స్వరాన్ని పెంచి వినపడుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, ఈ ఖైదీలు భారతదేశంలోకి ప్రవేశించి ఉండవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో భారతదేశంలో ఆందోళన మరింత పెరిగింది.

Also Read: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం దీనిని ధృవీకరించింది. జూలై-ఆగస్టులో రాజకీయ గందరగోళం సమయంలో జైళ్ల నుండి తప్పించుకున్న దాదాపు 700 మంది ఖైదీల జాడ ఇప్పటికీ లేదని తెలిపింది. దాదాపు 700 మంది ఖైదీలు ఇంకా కనిపించడం లేదని హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి ఇక్కడ తెలిపారు. వాటిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివరాలు ఇవ్వకుండానే, చాలా మంది ఖైదీలను తిరిగి అరెస్టు చేశారని అయితే పారిపోయిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

ఖైదీల గుర్తింపు గురించి అడిగిన ప్రశ్నకు జహంగీర్ ఆలం చౌదరి సమాధానమిస్తూ, ఇంకా పరారీలో ఉన్న ఖైదీలపై వివరణాత్మక దర్యాప్తు జరుగుతోందని అన్నారు. ఆగస్టు 5 తర్వాత సాధారణ క్షమాభిక్ష కింద ఏ దోషిని జైలు నుండి విడుదల చేయలేదని హోం వ్యవహారాల సలహాదారు వివరించారు. “వారు కొత్త క్రిమినల్ నేరాలకు పాల్పడినట్లు తేలితే, వారిని అరెస్టు చేస్తారు” అని చౌదరి అన్నారు. దేశవ్యాప్తంగా దోపిడీలు, నేరస్థుల సంఘటనలు పెరుగుతున్నాయని, అయితే దీనిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. 

జులై చివరలో, ఆగస్టు ప్రారంభంలో బంగ్లాదేశ్‌లో అనేక జైలు దోపిడీ సంఘటనలు జరిగాయి. ఢాకా సమీపంలోని సెంట్రల్ నర్సింగ్డి జిల్లాలో ఒక పెద్ద సంఘటన చోటు చేసుకుంది. అక్కడ 826 మంది ఖైదీలు తప్పించుకున్నారు.

Also Read: USA: డిపోర్టేషన్...అమెరికాపై మండిపడుతున్న బ్రెజిల్, కొలంబియా

Also Read: Siraj: ఆమె నాకు చెల్లెలులాంటి..నన్ను వదిలేయండి..మహ్మద్ సిరాజ్

Advertisment
Advertisment
తాజా కథనాలు