Operation Karregutta: ఫైనల్ ఆపరేషన్.. డ్రోన్లు, రాకెట్లతో కర్రెగుట్ట ఖతం!

ఆపరేషన్ కర్రెగుట్ట తుది దశకు చేరుకుంది. ఇప్పటికే మావోల అడ్డాను స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో ఏరివేసేందుకు డ్రోన్లు, రాకెట్లను ప్రయోగించనున్నారు. మానవరహిత దాడులతో కర్రెగుట్టలను తుడిచిపెట్టేందుకు భద్రతా బలగాలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

New Update
26 Maoists Killed in Karreguttalu

Operation Karregutta Police to launch drones and rockets

Operation Karregutta: ఆపరేషన్ కర్రెగుట్ట తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మావోల అడ్డాను స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో ఏరివేసేందుకు డ్రోన్లు, రాకెట్లను ప్రయోగించనున్నట్లు సమాచారం. మానవరహిత దాడులతో కర్రెగుట్టలను తుడిచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. 

తప్పుకున్న తెలంగాణ పోలీసులు..

దాదాపు రెండు నెలలుగా తెలంగాణ, ఛత్తీస్ గఢ్, కేంద్ర బలగాలు కలిసి కర్రెగుట్టలను జల్లెడ పడుతున్నాయి. భారీ సంఖ్యలో మావోయిస్టులు కర్రెగుట్టల్లో తలదాచుకున్నారని, సుమారు 3వేల మందిని డ్రోన్లతో గుర్తించినట్లు ప్రకటించాయి. అంతేకాదు ఇందులో 30 మందికిపైగా ఎన్ కౌంటర్ చేసినట్లు తెలిపాయి. అయితే తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో శాంతి చర్చల కమిటీ, కేసీఆర్, ప్రజా సంఘాల ఒత్తిడితో తెలంగాణ పోలీసులు ఈ ఆపరేషన్ నుంచి తప్పుకున్నారు. దీంతో కేంద్ర బలగాలు, చత్తీష్ గఢ్ కలిపి 50వేలమంది బలగాలు మాత్రమే కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. 

Also Read :  బయటపడ్డ టర్కీ మరో కుట్ర.. పాక్‌తో కలిసి ఏం చేసిందంటే?

పాక్ తో యుద్ధం రద్దు కావడంతో..

అనూహ్యంగా పాక్, భారత్ యుద్ధం తెరపైకి రావడంతో కేంద్రబలగాలను ప్రభుత్వం కర్రెగుట్టలనుంచి బార్డర్ కు రప్పించింది. అయితే పాక్ తో యుద్ధం రద్దు కావడంతో మరోసారి కర్రెగుట్టలపై ఫోకస్ చేశారు. తెలంగాణ పోలీసు సహకారం లేకపోవడంతో కొద్దిగా ఇబ్బంది పడిన కేంద్ర బలగాలు ఇప్పుడు కర్రెగుట్టలపై పూర్తి పట్టు సాధించినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు భవిష్యత్తులో కర్రెగుట్టలవైపు కన్నెత్తి చూడకుండా ఇప్పటికే పర్మినెంట్ పోలీసులు క్యాంపులు ఏర్పాటు చేయగా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆపరేషన్ పూర్తిగా మానవరహితంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. డ్రోన్లు, రాకెట్లతో బాంబులు వేసి మావోయిస్టులను హతమార్చేందుకు ప్రణాళికి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!

అధునాతన బాంబులు..

డ్రోన్లతో మావోల కదలికలను గుర్తించి అక్కడ రాకెట్లతో దాడులు చేయాలని భావిస్తున్నారట. దాదాపు 300 కిలోమీటర్ల మేర విస్తీర్ణం కలిగివున్న కర్రెగుట్టలను చేధించడం కష్టంగా మారడంతో టెక్నాలజీని వాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.  పహల్గాం ఎఫెక్టుతో దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం లేకుండా చేయాలని బలంగా కోరుకుంటున్న బీజేపీ ప్రభుత్వం.. సాధ్యమైనంత త్వరగా మావోయిస్టులను తుడిచిపెట్టాలని చూస్తోంది. అధునాతన బాంబులు, రాకెట్లు, డ్రోన్లతో కర్రెగుట్టలను తుడిచిపెట్టేందుకు భద్రతాబలగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.  

ఇది కూడా చూడండి: Ind-Pak: మోదీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి..పాక్ విదేశాంగ శాఖ

Also Read :  ముసలోడే కానీ మహానుభావుడు..! స్పోర్ట్స్ కారుతో భారీ స్టంట్స్..

 maoist | police | telugu-news | today telugu news

Advertisment
Advertisment
తాజా కథనాలు