/rtv/media/media_files/2025/06/15/zKRvaeWjnSbloB3QcN4K.jpg)
Zaheerabad
Telangana: చేయని నేరానికి ఆ పసిబిడ్డ తన ప్రాణాలు పోగొట్టుకుంది. మతిస్థిమితం లేని తల్లికి పుట్టిన రెండు నెలల పసికందు రోడ్డు పాలైంది. తాగుడుకు బానిసైన తండ్రి పట్టించుకోకపోగ మతిస్థిమితం లేని తల్లి తన బిడ్డ ప్రాణం పోవడంతో ఏం చేయాలో తెలియక వదిలేసి వెళ్లింది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న జనరిక్ మెడికల్ షాప్ పక్కనే రెండున్నర నెలలు నిండిన ఆడ పసిపాపను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లినట్లు స్థానికులు గుర్తించారు.ఆ పసిపాప చనిపోయిందని తెలుసుకొని అక్కడ వదిలేసి వెళ్లినట్లు జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకుడు అనిల్ కుమార్, పట్టణ సీఐ రమేష్ లు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు.
Also read: ఇంధనం కలుషితమైందా? పక్షి ఢీకొట్టిందా?: ఫ్లైట్ యాక్సిడెంట్కు 8 షాకింగ్ కారణాలివే!
సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఓ మహిళ తనకు పుట్టి రెండు నెలలు నిండి చనిపోయిన ఆడబిడ్డను వదిలేసి వెళ్లిందని గుర్తించారు. కాగా ఆ మహిళ గురించి ఆరా తీసిన పోలీసులకు గుండె చెదిరే విషయాలు తెలిశాయి. జహీరాబాద్ మండలం హద్నూర గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి గౌరీ (28) తో పెళ్లయింది. వీరికి రెండు నెలలకిందట ఒక ఆడ బిడ్డ పుట్టింది. అయితే గౌరీ మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తోంది. దీంతో ఎప్పుడూ ఇంట్లో ఉండేది కాదు. దీంతో రాజు మద్యానికి బానిసయ్యాడు. గౌరీ రోజు తన బిడ్డను తీసుకుని జహీరాబాద్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుండేది. ఇంటికి సరిగా వెళ్లేది కాదు. పసిబిడ్డకు ఏం పట్టాలో కూడా తెలియని గౌరీ తన బిడ్డకు పాలు కూడా పట్టిందా లేదా తెలియదు. దీంతో శనివారం ఆ బిడ్డ చనిపోయింది. చనిపోయిన తన బిడ్డను ఏం చేయాలో తెలియక చనిపోయిన బిడ్డను పట్టుకుని అక్కడక్కడే తిరిగింది. ఆ తర్వాత జహీరాబాద్ బస్టాండ్ కు చేరుకుని బస్సు ఎక్కి నేరుగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత తన బిడ్డను ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అక్కడే వదిలేసి వెళ్లింది.
Also Read: ఇజ్రాయిల్ అంతు చూసేందుకు.. ఇరాన్ వద్ద ఉన్న 5 పవర్ ఫుల్ వెపన్స్ ఇవే!
కాగా అటుగా వెళుతున్న కొంతమంది స్థానికులు పసిబిడ్డ ను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రి సిబ్బంది సహకారంతో బిడ్డ చనిపోయిందని నిర్ధారించారు. మార్చురీలో పసిపాపను భద్రపరిచారు. అనంతరం సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా గౌరీ పరిస్థితి తెలిసింది. పోలీసులు బిడ్డ తల్లి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో జహీరాబాద్ పట్టణ పోలీసులకు అప్పగించారు. ఆమెకు చికిత్సతో పాటు భార్యభర్తలు ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు.
Also Read: రెండుసార్లు టికెట్ రద్దు చేసుకుని..మూడోసారి మృత్యుముఖంలోకి..