/rtv/media/media_files/2026/01/03/fotojet-62-2026-01-03-08-56-08.jpg)
New Year tragedy..wild boar kills..
TG News : నూతన సంవత్సరం సందర్భంగా బిర్యానీ తినేందుకు వెళ్లిన స్నేహితులను అడవిపంది రూపంలో మృత్యువు వెంటాడింది. కారుకు అడ్డంగా అడవిపంది రావడంతో దాన్ని తప్పించబోయి కారు బోల్తా కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాధ ఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను మహేశ్వరం ఎస్సై ప్రసాద్ వివరించారు. మహేశ్వరం మండల పరిధిలోని పోరండ్ల గ్రామానికి చెందిన గిరి, శ్రీకాంత్, శివలు స్నేహితులు. నూతన సంవత్సరం సందర్భంగా ఆనందంగా గడిపిన వారు గురువారం రాత్రి బిర్యానీ తినేందుకు స్వగామ్రమైన పోరండ్ల నుంచి మహేశ్వరం మండల కేంద్రానికి కారులో వచ్చారు.
ముగ్గురు కిలిసి మహేశ్వరంలో బిర్యానీ తిన్న అనంతరం పోరండ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ కారులో వెళ్తున్న క్రమంలో ఆక్సాన్పల్లి గేటు సమీపానికి చేరుకోగానే ఒక అడవిపంది రోడ్డు పైకి ఒక్కసారిగా దూసుకు వచ్చింది. అందోళనతో దానిని తప్పించబోయే క్రమంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో గిరి (29), శ్రీకాంత్ (27)లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన శివను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Follow Us