Telangana: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పేరు ప్రకటన.. ఎప్పుడంటే ?

ఈ నెల 29న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నిజామాబాద్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటన తర్వాత బీజీపీ అధ్యక్షుడి విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
New Telangana BJP President Likely to be Announced soon

New Telangana BJP President Likely to be Announced soon

తెలంగాణలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఇప్పటికే ఆ పదవి కోసం కీలక నేతలు పోటీ పడుతున్నారు. మరోసారి తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 29న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నిజామాబాద్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అక్కడ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అమిత్ షా పర్యటన తర్వాత బీజీపీ అధ్యక్షుడి విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే హైకోర్టు కూడా సెప్టెంబర్‌ లోపు ఈ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే అధ్యక్షుడి మార్పునకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తంగా ఒకేసారి 10 రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించేందుకు బీజేపీ హైకమాండ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పది రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించిన తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎంపికకు మార్గం సుగమం అవుతుంది.  

Also Read: షాకింగ్ వీడియో.. తన మూత్రంతో కళ్ళు కడుకున్న మహిళ - దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

అయితే జులై రెండో వారంలో రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని రాజ్యసభ సభ్యులు ఎంపీ డా.లక్ష్మణ్ మీడియాతో తెలిపారు. ఇప్పటికే చాలాసార్లు అధ్యక్షుడి ప్రకటన వాయిదా పడుతూ వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డులు జారీ, రైతు భరోసా నిధులు జమ లాంటి స్కీమ్‌లు అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. 

Also Read: వీడెవ్వడ్ర బాబు.. భార్య విడాకులిచ్చిందనే కోపంతో రైలునే తగలబెట్టేశాడు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు