/rtv/media/media_files/DSRldYZx7ZbiJl7MCFKO.jpg)
Minister Seethakka
Minister Seethakka: అమ్మాయిలను వేధించినా.. వారిని ఇబ్బంది పెట్టినా..సంఘ బహిష్కరణ చేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. రాజేంద్రనగర్లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధో మథన సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆకాశాన్ని చీల్చుకొని అమ్మాయిలు అంతరిక్షానికి వెళ్లినా భూమి మీద కొన్నిసార్లు ఆడబిడ్డలకు రక్షణ కరువవుతుందని మంత్రి సీతక్క వాపోయారు. అందుకే అమ్మాయిల స్వీయ రక్షణ కోసం బాలికా రక్షక టీములను ఏర్పాటు చేయాలన్నారు. అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణకు గురవుతారని, అమ్మాయిలను ముట్టుకుంటే కఠిన శిక్షలు ఉంటాయని, అమ్మాయిల పట్ల చెడుగా ప్రవర్తిస్తే ఇలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందని అబ్బాయిలకు అవగాహన కల్పించాలని సూచించారు.
RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
Also Read: భారత్లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
రెండు రోజుల పాటు జరిగిన మేదో మథన సదస్సు విజయవంతమైందని అన్నారు. మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నో కొత్త ఆలోచనలకు ఈ సదస్సు ప్రాణం పోసిందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. జిల్లాల్లో ఇలాంటి సదస్సులు నిర్వహించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ సదస్సులో మహిళా శిశు సంక్షేమంపై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, మేధావులు తమ విలువైన సలహాలు ఇచ్చారని, మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తామని మంత్రి చెప్పారు. కమిటీ ఇచ్చిన సలహాలు, సూచనలతో శాఖ ద్వారా అందుతున్న సేవలను మరింత పటిష్ట పరుస్తామన్నారు. బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామని, స్వీయ రక్షణ టీములుగా స్నేహ కమిటీలు పనిచేస్తాయని మంత్రి వివరించారు. అంగన్వాడి టీచర్ల ద్వారా అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తామని, మహిళా బాలికల భద్రత మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి, అంగన్వాడీలను వారితో అనుసంధానం చేస్తామమన్నారు. త్వరలో మహిళల హక్కుల మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించి, మహిళ భద్రత కోసం ప్రతిష్ట విధానాలను రూపొందిస్తామని తెలిపారు.
ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు
ఈ సందర్భంగా బాలల హక్కుల కమిషన్ సభ్యులు, బీడబ్ల్యుఓలు, సీడీపీఓలు, సూపర్ వైజర్ల నుంచి పలు అంశాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు పిల్లలను శిశు గృహాల ద్వారా సంరక్షిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా అధికారులు సీతక్కకు వివరించారు. అంగన్వాడి కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన తర్వాత అంగన్వాడి కేంద్రాల రూపు రేఖలు మారాయని పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు