Telangana: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ స్కీమ్‌ కింద మొదటి విడుదలో భాగంగా తమ ప్రభుత్వం 4.50 లక్షల ఇళ్లు కేటాయించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చేనాటికి పేదలకు 20 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు.

New Update
Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ స్కీమ్‌ కింద మొదటి విడుదలో భాగంగా తమ ప్రభుత్వం 4.50 లక్షల ఇళ్లు కేటాయించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఆయన ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. 
'' ప్రతి నియోజకవర్గంలో కూడా 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. కులమతాలకు అతీతంగా ఇళ్లను కేటాయిస్తున్నాం. ఎన్నికలు వచ్చేనాటికి పేదలకు 20 లక్షల ఇళ్లు కట్టిస్తాం. లబ్ధిదారులకు 4 విడుతల్లో రూ.5 లక్షలు అందిస్తున్నాం. మధ్యవర్తులకు ఇవ్వకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వేస్తాం. న్యాయపరమైన భూ సమస్యలు పరిష్కరిస్తామని'' పొంగులేటి అన్నారు. 
మరోవైపు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు లేఖ రాశారు. తెలంగాణలో గ్రామాల పరిస్థితి, పంచాయతీ కార్యదర్శు పరిస్థితి దయానీయంగా ఉందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులు, పంచాయతీ కార్యదర్శుల పనితీరు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  
Advertisment
Advertisment
తాజా కథనాలు