Telangana: కవిత ఇష్యూపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

మంత్రి పొంగులేటి కవిత వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే మంత్రి పదవి ఇస్తారా లేదా వేరే పదవి ఇస్తారా అనేది నాకు తెలియదన్నారు. ఎవరో ఆడిస్తే కవిత ఆడుతున్నారని ఆరోపించారు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతోందని తెలిపారు.

New Update

తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో ఎమ్మెల్సీ కవితకు జరుగుతున్న వివాదం హాట్‌ టాపిక్‌గా మారింది. కవిత పార్టీ మారుతారని, లేదా కొత్త పార్టీ పెడుతారని పలువురు ప్రచారాలు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. '' కవిత కాంగ్రెస్‌లోకి వస్తే మంత్రి పదవి ఇస్తారా లేదా వేరే పదవి ఇస్తారా అనేది నాకు తెలియదు. నేను పార్టీలో చిన్న కార్యకర్తను. 

Also Read: నాన్న హీరో, అన్న విలన్.. కవిత, షర్మిల మధ్య పోలికలివే !

కవిత ఎపిసోడ్‌ టీ కప్పులో తుఫాన్ లాంటింది. ఎవరో ఆడిస్తే కవిత ఆడుతున్నారు. ఆమె ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఓసారి దెయ్యం అంటోంది, మరోసారి దేవుడు అంటోంది. నాన్న మంచోడు అంటోంది. అన్న కుట్ర చేస్తున్నాడు అంటోందని'' పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

Also Read: అది డాడి డాటర్, అన్నాచెల్లెళ్ల సమస్య: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. అది డాడీ, డాటర్.. అన్నా చెల్లెళ్ల సమస్య అని.. పనిరాని మ్యాటర్ అని అన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన కవిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని తెలిపారు. కవిత విషయం పార్టీ లేదా ఫ్యామిలీ అంతర్గత వ్యవహారమని అన్నారు. అది తెలంగాణ ప్రజల సమస్యగా తాము పరిగణించమని పేర్కొన్నారు. ఆస్తి, అధికారం కోసం కొట్లాడుతున్న సమస్య కవితదని.. మాకు, ప్రజలకు ఆ అంశంపై మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. 

kavita | ponguleti-srinivas | brs-mlc-kavita | telugu-news | rtv-news

Advertisment
Advertisment
తాజా కథనాలు