SLBC Tunnel : ఆ 8 మంది బతికే ఛాన్స్ లేదు.. మంత్రి జూపల్లి షాకింగ్ ప్రకటన!

SLBCఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన కామెంట్స్ చేశారు. అద్భుతం జరిగితే తప్ప టన్నెల్‌లో చిక్కుకున్న 8మంది బతికే ఛాన్స్ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రకృతి విపత్తుని రాజకీయంగా వాడుకుంటుందని, శవాల మీద పేలాలు ఎరుకుంటున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. 

author-image
By srinivas
New Update
slbc jupally

Minister Jupally Krishna Rao sensational comments on SLBC incident

SLBC: SLBCఘటనపై మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన కామెంట్స్ చేశారు. అద్భుతం జరిగితే తప్ప టన్నెల్‌లో చిక్కుకున్న 8మంది బతికే చాన్స్ లేదన్నారు. బీఆర్ఎస్ ప్రకృతి విపత్తుని రాజకీయంగా వాడుకుంటుందని, హరీష్ రావు, కేసీఆర్ శవాల మీద పేలాలు ఎరుకుంటున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. 

 

వారు బతికే ఛాన్స్ లేదు..

ఈ మేరకు శుక్రవారం టన్నెల్ ప్రమాదం గురించి మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. వారు బతికే ఛాన్స్ లేదన్నారు. ఇక రాజకీయ దురుద్దేశంతోనే ఈ ప్రమాదంపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. SLBCపై హరీష్ రావు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అన్నారు. పదేండ్లు పాలించిన బీఆరెస్ ఎందుకు టన్నెల్ ను పెండింగ్ లో పెట్టిందని ప్రశ్నించారు. హరీష్ రావుకు సూటి ప్రశ్న? ఎందుకు 200 లోమీటర్లు SLBC టన్నెల్ తవ్వి మిగతాది వదిలేసిండ్రు? తక్కవ లాభం వస్తుందనా? SLBC పూర్తి అయితే కాంగ్రెస్‌కు పేరు వస్తుందనా? ఈ మూడు ప్రశ్నలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

బీఅరెస్ శవాల మీద పేలాలు..

అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే slbcని ఎందుకు పెండింగ్ పెట్టారు. Slbc గురించి మాట్లాడే హక్కు బీఆరెస్ కు లేదు. బీఅరెస్ శవాల మీద పేలాలు ఎరుకుంటోంది. అద్భుతం జరిగితే తప్ప టన్నెల్ లో చిక్కుకున్న  8మంది బతికే చాన్స్ లేదు. సహక చర్యలకు ఇంకా రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు కంపెనీ వాళ్ళు అలెర్ట్ చేయకపోతే 40 మంది వరకు చనిపోయే వారు. పాలమూరు రంగా రెడ్డిలో 6గురు చనిపోయారు. అప్పుడు కేసీఆర్, హరీష్ రావు వచ్చారా? కొండగట్టు బస్ ప్రమాదంలో 70మంది చనిపోతే వీరెక్కెడపోయారని విమర్శించారు. 

Also Read: హైక్లాస్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ఫస్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్- డోంట్ మిస్!

SLBC ని పరామర్శించడానికి పర్మిషన్ ఇచ్చాం. కానీ అక్కడికి పోయి రాజకీయాలు ఎందుకు? స్కానర్ ద్వారా తెలుసుకోవడం కోసం జాతీయ ఏజెన్సీలను పిలిచాం. స్వయంగా నేను వెళ్ళాను. 50మీటర్లు మాత్రమే కనిపించట్లేదు. పూర్తి చేయాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎకరాకు 3లక్షలు అవుతుంది. ఇప్పుడు అదనంగా ఎకరాకు 10 వేలు ఖర్చు పెరిగింది. ఇతర ప్రాజెక్టులకు వేల కోట్ల కరెంట్ బిల్ వస్తుంది. యుద్ద భూమిలో ఎలికాఫ్టర్ నడిపిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఎన్నిసార్లు ఎలికాఫ్టర్‌లో తిరిగినా ఏడాదికి ఒకసారి రెంట్ కడతారు. నేను బీఅరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి పోయిన అని హరీష్ రావు అంటుండు. అమరవీరుల, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదుకాబట్టే ఆ పార్టీ నుంచి నేను బయటక వచ్చాను. ఇప్పటికైనా హరీష్ రావు శవరాజకీయలు మానుకోవాలని మండిపడ్డారు.

Also Read: పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. కోర్టు సంచలన తీర్పు.. ఇక జైల్లోనే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు