సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద తనిఖీల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతం నుంచి మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో అధికారులు సోదాలు చేశారు. లారీలో తరలిస్తుండగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇది కూడా చూడండి: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్ డీఆర్ఐ, నార్కొటిక్ డ్రగ్స్ కంట్రోల్, సెంట్రల్ విజిలెన్స్ బృందాలు ఈ తనిఖీలో పాల్గొన్నాయి. గంజాయిని పట్టుకున్న వెంటనే డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. అయితే వీటిని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పోర్టు నుంచి ముంబయికి తరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే లారీని చిరాగ్పల్లి పోలీస్ స్టేషనకు తరలించారు. ఇది కూడా చూడండి: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం ఇదిలాఉండగా.. ఈ మధ్య కాలంలో చాలాచోట్ల భారీగా డ్రగ్స్ పట్టుపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అరేబియ మహాసముద్రంలో 500 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీలంక నౌకాదళం, భారత నౌకదళం చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెండు పడవలు, సిబ్బందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తదుపరి చర్యల కోసం శ్రీలంక అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. Also Read: భార్యల వేధింపులకు భర్తలు బలి.. ఎన్ని ఘోరాలు జరిగాయంటే? Also Read: అలా అయితే సగం మంది రాజకీయ నాయకులు జైలుకే! బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు