Shamshabad Airpor : శంషాబాద్‌లో  పలు విమానాలు ఆలస్యం..ప్రయాణీకుల ఆందోళన

దేశవ్యాప్తంగా సాంకేతిక సమస్యల కారణంగా పలు ఎయిర్‌ పోర్టుల్లో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. శంషాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయి.  ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతికలోపం తలెత్తడంతో విమాన సర్వీస్‌లు నిలిచిపోయాయి.

New Update
 Shamshabad Airport

 Shamshabad Airport

 Shamshabad Airpor :  దేశవ్యాప్తంగా ఎయిర్‌ పోర్టుల్లో సాంకేతిక సమస్యల కారణంగా పలు ఎయిర్‌ పోర్టుల్లో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. శంషాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయి.  ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతికలోపం తలెత్తడంతో విమాన సర్వీస్‌లు నిలిచిపోయాయి. అలాగే చెన్నై నుంచి శంషాబాద్‌ రావాల్సిన రెండు విమానాలు ఆలస్యం అయ్యాయి. విమాన సర్వీస్‌ల ఆలస్యంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణీకుల అవస్థలు పడుతున్నారు.

ఢిల్లీ విమాన శ్రయంలో ఎటీసీ వ్యవస్థలో సాంకేతిక లోపంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  350కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాల ఆలస్యంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రద్దీ పెరిగింది. ఇప్పటికే షెడ్యూల్‌ చేసిన విమానాలన్నీ రద్దు చేశారు. ముంబై ఎయిర్‌పోర్టులోనూATC వ్యవస్థ కుప్పకూలింది. ముంబై ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల అవస్థలు పడుతున్నారు.కాగా ఈ విషయమై కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. ఎయిర్‌పోర్టుల్లో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు.ATCలో సాంకేతికలోపం వల్లే అంతరాయం ఏర్పడిందన్నారు.సాంకేతిక సమస్య వెనుక బయటివ్యక్తుల ప్రమేయం లేదన్నారు.అయినా లోతైన దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు. సకాలంలో విమానాలు నడిచేలా చర్యలు చేపట్టామన్నారు.
 
 ప్రయాణికుల ఆందోళన..

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన విమానాల ఆలస్యంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. అలాగే శంషాబాద్‌ నుంచి వియత్నం బయలుదేరాల్సిన విమానం రన్‌వే పైనే నిలిపి వేశారు. టేకాఫ్ అవ్వకుండా.. కొన్ని గంటల పాటు ప్రయాణికులతో అలానే ఉండిపోవడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ప్రయాణికులు వియత్నం ఎయిర్‌బస్సు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిన్న(శుక్రవారం) రాత్రి 11 గంటలకు శంషాబాద్ నుంచి వియత్నం వెళ్లాల్సిన విమానం ఇప్పటికీ వెళ్లలేదు. దీంతో రాత్రి నుంచి ప్రయాణికుల ఆందోళన తెలుపుతున్నారు.

 విమాన సమయాలపై ఎయిర్‌పోర్ట్ అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు వారితో గొడవ పడుతున్నారు.మరోవైపు విమానం ఎప్పుడు టేకాఫ్ అయితుందో కూడా సిబ్బంది చేప్పకపోవడంతో.. తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడడంతో ఎయిర్‌లైన్‌ సిబ్బందిపై మండిపడుతున్నారు. మరోవైపు వీకెండ్ కావడంతో.. విమానాశ్రయం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో విమానంలో 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాశారు.

ఇది కూడా చూడండి: Maoist Partys Ceasefire: కాల్పుల విరమణ ఊహించని పరిణామం..మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

Advertisment
తాజా కథనాలు