Delhi: దేశంలోని 40 ఎయిర్పోర్టులను పేల్చేస్తాం.. దుండగుల మెయిల్స్!
ఇండియాలోని 40 విమానాశ్రయాలను పేల్చేస్తామంటూ దుండగులు మెయిల్స్ పెట్టడం కలకలం రేపుతోంది. ఢిల్లీ, జైపూర్, పాట్నా, కోయంబత్తూర్, వడొదరా ఎయిర్పోర్టులను ద్వంసం చేస్తామంటూ మెయిల్స్ రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అన్ని ఎయిర్పోర్టుల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.