BIG BREAKING: సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా.. జస్టిస్ బీర్‌ గవాయ్ నియామకం..

రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా.. జస్టిస్‌ భూషన్ రామకృష్ణ (BR) గవాయ్‌ను నియమించారు. మే 14 నుంచి ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సేవలందించనున్నారు.

New Update
President Murmu appoints BR Gavai as Chief Justice of India with effect from May 14

President Murmu appoints BR Gavai as Chief Justice of India with effect from May 14

రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా.. జస్టిస్‌ భూషన్ రామకృష్ణ (BR) గవాయ్‌ను నియమించారు. మే 14 నుంచి ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సేవలందించనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించారు. 

Also Read: సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా, ఏకిపారేయ్యండి .. ప్రధాని మోదీ సంచలనం

జస్టిస్ బీఆర్‌ గవాయ్.. 52వ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆయన కేవలం 6 నెలలు మాత్రమే చీఫ్‌ జస్టిస్‌గా సేవలు అందిస్తారు. ఎందుకంటే ఈ ఏడాది నవంబర్‌లోనే ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా అవకాశం కల్పించారు.  

Also Read: పాకిస్థాన్‌కు షాక్.. ఇజ్రాయెల్ సాయంతో భారత్ సరికొత్త ప్లాన్ !

ఇదిలాఉండగా జస్టిస్ గవాయ్ 2019లో మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 1960 నవంబర్ 24న ఆయన మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. ఆయన తండ్రి ఆర్‌ఎస్‌ గవాయ్.. బిహార్, కేరళకు గవర్నర్‌గా పనిచేశారు. అలాగే సామాజిక కార్యకర్తగా ఆయనకు మంచి గుర్తింపు కూడా ఉంది. ఇక జస్టిస్ బీఆర్‌ గవాయ్.. 2003లో బాంబే హైకోర్టులో అడిషనల్ జడ్జిగా తన న్యాయవృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2005లో పర్మినెంట్ జడ్జిగా ఎంపికయ్యారు. ముంబయి, నాగ్‌పూర్, ఔరంగాబాద్, పనాజీ ప్రాంతాల్లోని కోర్టు ధర్మాసనాల్లో 15 ఏళ్లకు పైగా పనిచేశారు.   

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు