Rythu Bharosa: రైతులకు గుడ్‌న్యూస్.. రైతుభరోసా నిధులు జమ

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారు.

New Update
Rythu Bharosa Funds

Rythu Bharosa Funds

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారు. ఎకరాలతో సంబంధం లేకుండానే రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: అంతా నీ ఇష్టమేనా?: పొంగులేటిపై పీసీసీ చీఫ్ సీరియస్!

కాంగ్రెస్‌ సర్కార్‌ ఎకరానికి రబీ, ఖరీఫ్ సీజన్లకు రూ.6 వేల చొప్పున రెండు విడుతల్లో రూ.12 వేలు అందుస్తోంది. ఇందులో భాగంగానే మంగళవారం (జూన్ 17) నుంచి జూన్ 25 వరకు విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేయనుంది. ఇప్పటికే రైతులు వానకాలం పంట పనుల్లో నిమగ్నమయ్యారు. రైతు భరోసా నిధుల పంపిణీపై తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

Also Read: ఫార్ములా ఈ కారు రేసు కేసు.. ముగిసిన కేటీఆర్ విచారణ

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా సీఎం రేవంత్ మంత్రులతో చర్చించారు. జిల్లా నేతలతో ఇన్‌ఛార్జి మంత్రులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచనలు చేశారు. ఈ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు