Kaushik Reddy: కౌశిక్ రెడ్డి కేసు...వరంగల్‌లో ఉద్రిక్తత

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ వరంగల్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేసిన సుబేదారి పోలీసులు వరంగల్‌కు తీసుకువచ్చారు.

New Update
MLA Padi Kaushik Reddy Arrest

MLA Padi Kaushik Reddy Arrest

గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ వరంగల్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో శుక్రవారం అర్థరాత్రి అరెస్ట్‌ చేసిన సుబేదారి పోలీసులు వరంగల్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా కౌశిక్‌ రెడ్డి అరెస్ట్‌ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు పెద్ద ఎత్తున సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.  కౌశిక్‌రెడ్డి పై సెక్షన్ 308(2), (4), 352 కింద కేసు నమోదు చేయడంతో బీఆర్‌ఎస్ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, లీగల్ టీమ్‌తో కలిసి పోలీస్‌ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌ను కలిశారు.

Also Read: ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే.. 7ఏళ్లు జైలుశిక్ష, రూ.10 ల‌క్షల జరిమానా!

Also Read :  డైరెక్టర్‌ మిస్సింగ్‌ మిస్టరీ.. విషాదం మిగిల్చిన విమాన ప్రమాదం

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై అక్రమంగా పెట్టిన కేసు సెక్షన్లను మార్చాలని వారు కోరారు. లీగల్ అడ్వైజర్లతో మాట్లాడి చెప్తానని సీపీ సమాధానం ఇవ్వడంతో ఆర్‌ఎస్‌ నేతలు తిరిగి వెళ్లిపోయారు. అయితే బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మాత్రం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డికి బెయిల్ రాకుండా కుట్రలు చేసి జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆయనపై నాన్‌ బెయిలేబుల్ కేసులు పెట్టడం సరికాదన్నారు. రేవంత్ పాలన అట్టర్ ప్లాప్ అన్న దయాకర్‌ రావు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికల కోసమే బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.  కాగా నిన్న రాత్రి నుంచి పోలీస్‌ స్టేషన్‌లోనే ఉన్న కౌశిక్‌ రెడ్డిని దయాకర్‌ రావుతో పాటు కౌశిక్ రెడ్డి భార్య శాలిని రెడ్డి, కౌశిక్ సోదరుడు ప్రతీక్ రెడ్డి కలిశారు.

ఎంజీఎంకు కౌశిక్‌ రెడ్డి

ఒకవైపు బీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన మధ్యనే కౌశిక్‌ రెడ్డిని సుబేదారీ పోలీస్‌స్టేషన్‌ నుంచి వైద్య పరీక్షల నిమిత్తంవరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యపరీక్షలు ముగిసిన అనంతరం ఆయనను  కోర్టులో హాజరుపరచనున్నారు.  కాగా ఆయనపై నాన్‌ బెయిలేబుల్‌ కేసులు నమోదు కావడంతో కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ వస్తుందా? రాదా అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.

Also Read: ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 290 మంది భారతీయులు

Also Read :  మాదాపూర్‌లో భారీ మోసం.. బై బ్యాక్‌ పేరుతో రూ.500 కోట్ల దోపిడీ

 

Huzurabad MLA | huzurabad | warangal | mla padi kaushik reddy latest news | Padi Kaushik Reddy in Another Controversy | padi-kaushik-reddy | padi kaushik reddy latest

Advertisment
Advertisment
తాజా కథనాలు