Bhatti Vikramarka: భయపడొద్దు.. మీకు నేనున్నా: గురుకుల స్టూడెంట్స్ కు భట్టి భరోసా!
పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు సందర్శించారు. ఇద్దరు విద్యార్థుల మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. అన్ని గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు.