తల్లి ప్రాణం తీసిన ఊయల.. మంచిర్యాలలో విషాదం
ఊయల మెడకు చుట్టుకుని తల్లి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మంచిర్యాలలో జరిగింది. తల్లి ముగ్గురు పిల్లలను ఊయలతో ఆడిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె మెడకు చుట్టుకుని మృతి చెందింది. కళ్ల ఎదుటే తల్లి మృతి చెందడంతో పిల్లలు బోరున ఏడుస్తున్నారు.