బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. మాది టీమిండియా, కాంగ్రెస్‌ది పాకిస్థాన్

క్రికెట్ మ్యాచ్ లాంటి MLC ఎలక్షన్స్ ఫిబ్రవరి 27న జరుగబోతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇండియా టీం బీజీపీ, ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్‌ది పాకిస్తాన్ టీం అని ఆయన విమర్శించారు. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు.

New Update
BANDI SANJAY

BANDI SANJAY

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. అలాగే ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో ఇండియా, పాకిస్థాన్ జట్ల మంది క్రికెట్ మ్యాచ్ జరగబోతుందని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ మ్యాచ్‌లో మా టీం ఇండియా అని, కాంగ్రెస్ పార్టీది పాకిస్థాన్ టీం అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.  ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్‌ది పాకిస్తాన్ టీం అని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు.

Also Read : Telangana: తెలంగాణవాసులకు చల్లటి కబురు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందో తెలుసా!

ఇండియా గెలవాలనుకుంటే బీజేపీకి ఓటేయండని గ్రాడ్యుయేట్లను కోరారు ఆయన. పాకిస్తాన్ గెలవాలనుకుంటే కాంగ్రెస్‌కు ఓటేయండని చెప్పారు. బీజేపీ గెలిస్తే పట్టభద్రుల, టీచర్ల ఆకాంక్షలను నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. కుల గణనకు మేం వ్యతిరేకం కానేకాదని, బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు.

Also Read: Virat Kohli: అదే నా వీక్ నెస్‌ అయ్యింది.. కోహ్లీ బయటపెట్టిన భావాలు!

తెలంగాణలోనూ ఎప్పటి నుండో దూదేకుల కులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నా.. దానికి ఏనాడూ అభ్యంతర పెట్టలేదని అన్నారు. కానీ 12.5 శాతం ముస్లిం జనాభాను 8.8 శాతం మందిని బీసీల్లో కలుపుతామంటే ఎందుకు ఒప్పుకుంటామని ప్రశ్నించారు. నూటికి 88 మందికిపైగా ముస్లింలను బీసీల్లో కలిపి నిజమైన బీసీల పొట్టకొడతారా అని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశారు. 60 లక్షల మంది బీసీల జనాభా ఎట్లా తగ్గిందో సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని అడిగారు. సమగ్ర కుటుంబ సర్వేలో 56 శాతం బీసీ జనాభా ఉందని నాటి మంత్రులు కేటీఆర్, హరీష్ అసెంబ్లీలో చెబితే ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు