TG Govt Jobs: తెలంగాణలో కొలువుల పండుగ.. 50 వేల ఖాళీల భర్తీకి రంగం సిద్ధం.. పోస్టుల వారీగా వివరాలివే!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలో తెలంగాణలో కొలువుల జాతర మొదలు కానుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయడంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీజీపీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది.

New Update
Jobs festival in Telangana

Jobs festival in Telangana

TG Govt Jobs:  తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలో తెలంగాణలో కొలువుల జాతర మొదలు కానుంది. ఎస్సీ వర్గీకరణ(SC Classification) పూర్తి చేయడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీజీపీఎస్సీ(TGPSC), గురుకుల, పోలీసు, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియను మొదలుపెట్టాలని సర్కారు యోచిస్తోంది. వివిధ విభాగాల్లో ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేసి, నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. అధికారిక వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు 56,740కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఇప్పటికే గుర్తించి.. ఖరారు చేసిన 14,236 అంగన్‌వాడీ పోస్టులు, 10,954 రెవెన్యూ పోస్టులు పోగా మిగిలినవి వివిధ శాఖల వారీగా ఉన్నాయి. అంతేకాకుండా గ్రూప్‌-1కు సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. వీటితోపాటు గ్రూప్‌-2, 3, 4 పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక జాబితాలో ఉన్న ఖాళీల భర్తీకిగాను వివిధ శాఖల్లో కలిపి 18,236 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.  

Also Read: Aghori - Sri Varshini: అఘోరీ చేతబడి చేసింది.. వర్షిణి అన్నయ్య హర్ష సంచలన వీడియో వైరల్

నెలరోజులపాటు నోటిఫికేషన్ల జాతర

రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల భర్తీకి ఏటా జాబ్​ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ ను జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని సర్కారు స్పష్టం చేసింది. దీంతో గత ఏడాది సెప్టెంబరు నుంచి వెలువడాల్సిన ఉద్యోగ నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. దీంతో జాబ్ క్యాలెండర్‌ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 14 నుంచి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. వర్గీకరణ పూర్తికావడంతో ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టనుంది. రెండు, మూడు రోజుల్లో పలు విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలు గుర్తించనున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నెల చివరి వారం నుంచి జూన్‌ 2 వరకు నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: యాక్షన్ షురూ.. ఎన్టీఆర్‌ - నీల్‌ సెట్ లో అడుగుపెట్టనున్న యంగ్ టైగర్

ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు


ఈసారి వీలయినన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలన్న లక్ష్యంతో సర్కారు ఉంది. రాష్ట్రంలో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల లెక్కలను తేల్చాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం సూచించింది.పోలీసు శాఖలో 10,500 కానిస్టేబుళ్లు, 1,650 వరకు ఎస్‌ఐ పోస్టులను గుర్తించినట్టు సమాచారం. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, మరో 2,150 డాక్టర్‌ పోస్టులను గుర్తించారు. వీటిలో 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి. ఇవికాకుండా మరో 2వేల వరకు నర్స్‌ పోస్టులు ఉన్నాయని సమాచారం.వైద్య ఆరోగ్యశాఖలో ల్యాబ్‌ టెక్నీషియన్లు, స్టాఫ్‌నర్సులు, ఫార్మాసిస్టులు కలిపి దాదాపు ఐదు వేల ఖాళీలు ఉన్నాయి.

Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

ఇంజినీరింగ్‌ విభాగాల్లోనూ 2-3 వేల వరకు ఖాళీలు ఉన్నట్లుగా సమాచారం. ఆర్టీసీలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఇప్పటికే ఆ సంస్థ ఎండీ సజ్జనార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్‌కు చేరినట్లుగా తెలిసింది. మరో గ్రూప్‌-1 నోటిఫికేషన్ జారీకి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తోంది. గురుకుల, ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు భారీగా ఉన్నాయి. గత గురుకుల నియామక ప్రక్రియలో దాదాపు రెండు వేల వేల పోస్టులు బ్యాక్‌లాగ్‌గా మారాయి. గ్రూప్‌-4 స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగంలోనూ భారీగా ఖాళీలున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.కాగా, పలు శాఖల్లోని ఇంజినీరింగ్‌ విభాగాల్లో కలిపి దాదాపు 2,510 పోస్టులు, వ్యవసాయ శాఖలో 148, ఆర్‌అండ్‌బీలో 185-200 వరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. అటవీ శాఖలోనూ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు కొన్ని భర్తీ చేయాలని గుర్తించినట్టు తెలిసింది. ఇవే కాకుండా మహిళా శిశు సంక్షేమ శాఖలో 6,399 అంగన్‌వాడీ టీచర్‌లు, 7,837 హెల్పర్‌లు కలిపి 14,236 పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.

Also Read: వేసవిలో తరచుగా కడుపునొప్పి వస్తుందా?. ఇది తెలుసుకోండి

గ్రామీణ స్థాయిలో..


గ్రామ పరిపాలన అధికారి (జీపీవో) పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లో ఉన్న 6 వేల మంది వీఆర్వోలను తిరిగి గ్రామ పరిపాలన అధికారులుగా నియమించన్నారు. మిగిలిన 4వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేయనున్నారు. 

హైదరాబాద్ కు మినహాయింపు,,,

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున.. ఆ జిల్లాను మినహాయించి మిగిలిన జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రాథమిక జాబితాలో ఉన్న పోస్టులు మాత్రమే కాకుండా స్కిల్‌ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ల(ఏటీసీ)లో అవసరమైన పలు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటితోపాటు న్యాయశాఖ, సచివాలయం, ఆర్థికశాఖ సహా మరికొన్ని శాఖలన్నింటిలో కలిపి మరో 7-8 వేల పోస్టులు ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే తేల్చి అన్నింటినీ కలిపి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్టు అధికారిక వర్గాలు అంటున్నాయి.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

#tgpsc #SC Classification #TG Govt Jobs
Advertisment
Advertisment
తాజా కథనాలు