Jeedimetla Mother Killed: పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ దారుణం.. జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు!

జీడిమెట్ల తల్లి హత్య జరగడానికి పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై పోక్సో కేసు పెట్టి అరెస్టు చేయకుండా నోటీసు ఇచ్చి వదిలేయడం వల్లే ఈ దారుణం జరిగిందని పోలీసులపై మండిపడుతున్నారు.

New Update
Jeedimetla mother murder case Shocking facts

Jeedimetla mother murder case Shocking facts

16 ఏళ్లు పెంచిన తల్లి ప్రేమ కంటే ఓ కూతురికి 8 నెలల ఇన్‌స్టా ప్రేమ ఎక్కువైపోయింది. తెలిసీ తెలియని వయసులో ప్రేమ అనే ముసుగులో.. అల్లారు ముద్దుగా పెంచిన కన్న తల్లిని 10వ తరగతి చదువుతున్న కూతురు చున్నీతో గొంతునులిమి, సుత్తితో తలపై కొట్టి కొట్టి చంపింది. ఈ ఘటన యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో జరిగిన ఈ ఇన్సిడెంట్‌తో ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 

పోలీసుల నిర్లక్ష్యం వల్లే

అయితే ఈ దారుణమైన మర్డర్ జరగడానికి పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వారి నిర్లక్ష్యం వల్లనే ఈ దారుణం జరిగిందని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలికకు ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి, తన బుట్టలో వేసుకుని, ఇంట్లో నుంచి తీసుకెళ్లిన వ్యక్తిపై పోక్సో కేసు పెట్టిన పోలీసులు.. అతడ్ని అరెస్టు చేయకుండా కేవలం నోటీసు ఇచ్చి వదిలేయడం వల్లే ఈ ఘోరమైన ఇన్సిడెంట్ జరిగిందని తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఒకవేళ నిందితుడ్ని అప్పుడే అరెస్టు చేసి ఉంటే ఈ దారుణమైన హత్య జరిగి ఉండేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. 

ఈ మేరకు ఈ హత్యకు బాలానగర్ డీసీపీ, ఏసీపీ, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ పరోక్షంగా కారణమయ్యారని మండిపడుతున్నారు. వెంటనే ఈ ఘటనపై సీపీ విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై ఎమ్మర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ స్పందించారు. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇందులో భాగంగానే అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్య జరిగిందని అన్నారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు