Hydra: హైడ్రా స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేస్తే కటకటాలపాలే!

హైడ్రా కీలక ప్రకటన విడుదల చేసింది. హైడ్రా పేరుతో ఎవరైనా లావాదేవీలు, అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలుంటాయ‌ని హైడ్రా కమీషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ప్రత్యక్షంగా లేదా ప‌రోక్షంగా హైడ్రా పేరుతో అవినీతికి పాల్పడ్డవారిపై కేసులు పెట్టినట్లు తెలిపారు. 

New Update
Ranganath - Hydra

Hydra Commissioner Ranganath issued importent announcement

Hydra: హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హైడ్రా పేరుతో ఎవరైనా లావాదేవీల‌కు, అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలుంటాయ‌ని హెచ్చరించింది. ఈ మేర‌కు అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్టు ఆధారాలుంటే వెంట‌నే త‌న దృష్టికి తీసుకు రావాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్(Commissioner AV Ranganath)  కోరారు. లేని ప‌క్షంలో ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ విభాగానికి, స్థానిక పోలీసు స్టేష‌న్లో ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. అవ‌క‌త‌వ‌క‌లు నిజ‌మైన ప‌క్షంలో హైడ్రా ఉద్యోగులైతే స‌స్పెండ్ చేయ‌డంతో పాటు.. క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా లేదా ప‌రోక్షంగా హైడ్రా పేరును వినియోగించుకుని వ‌సూళ్లకు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలుంటాయ‌న్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ప‌లువురిపై కేసులు కూడా పెట్టామ‌న్నారు. నోటీసులు ఇచ్చి హైడ్రా లావాదేవీలు చేస్తున్నట్టు ఏవైనా ఫిర్యాదులుంటే జ‌డ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి త‌మ దృష్టికి కాని, ఏసీబీ, విజిలెన్స్, పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని కోరారు. అలాగే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లొచ్చని చెప్పారు. 

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

వంశీరాం బిల్డర్లపై ఎమ్మెల్యే ఫిర్యాదు అంద‌లేదు..

గ‌త సంవ‌త్సరం 18.8.24న, 21.12.24 తేదీల్లో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నుంచి హైడ్రాకు రెండు ఫిర్యాదులు అందాయి. ఖాజాగూడ‌లోని తౌతానికుంటలో నీరు నిలిచిపోవ‌డం వ‌ల్ల గ్రీన్‌గ్రేస్ అపార్టు మెంట్ సెల్లార్‌లోకి నీరు చేరుతోంద‌నేది ఒక‌టి. తౌతానికుంట నిండిన త‌ర్వాత వ‌ర‌ద నీరు భ‌గీర‌థ‌మ్మ చెరువుకు వెళ్లడంలేద‌నేది రెండో ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ఈ రెండు ఫిర్యాదుల‌పైన కూడా  నేరుగా తానే రెండు సార్లు క్షేత్ర స్థాయిలో ప‌ర్యటించి స‌మ‌స్యల‌ను తెలుసుకున్నానని క‌మిష‌న‌ర్ గుర్తుచేశారు. పైనుంచి వ‌చ్చిన వ‌ర‌ద‌ను తౌతానికుంట‌కు త‌ర్వాత భ‌గీర‌థ‌మ్మ చెరువులోకి వెళ్లే అవ‌కాశాల‌ను ప‌రిశీలించారు. భ‌గీర‌థ‌మ్మ చెరువులో ఆక్రమ‌ణ‌లు గ‌త ఏడాది డిసెంబ‌రు చివ‌రి వారంలో హైడ్రా తొల‌గించింది. వంశీరాం మ్యాన్‌హ‌ట్టన్ ప్రాజెక్టుపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నుంచి ఎలాంటి ఫిర్యాదు అంద‌లేదు. ఈ విష‌యంలో వారి వ‌ద్ద ఏమైనా ఫిర్యాదు ఉంటే వాట్సప్‌లో అయినా పంపితే ప‌రిశీలిస్తాం. గ‌తంలో ఎమ్మెల్యే వాట్సాప్‌లో స‌మ‌స్యను చెబితే స్పందించాం. ప్రజాప్రతినిధుల ఫిర్యాదుల‌కు ప్రాధ‌న్యత ఉంటుంద‌ని తెలిపారు. 

ఫిర్యాదు ఎవ‌రిదైనా త‌క్షణ స్పంద‌న..

ఫోన్‌ చేసి తమ స‌మ‌స్యలను తెలుపవచ్చన్నారు. ఒక వేళ స‌మావేశాల్లో ఉన్నప్పుడు ఫోను లిఫ్ట్ చేయ‌లేక‌పోయినా ఫిర్యాదుదారులు మెసేజ్ పెడితే స్పందించ‌డం స‌ర్వసాధ‌ర‌ణంగా జ‌రుగుతుంద‌ని రంగ‌నాథ్‌గారు తెలిపారు. ప్రతి సోమ‌వారం నిర్వహించే ప్రజావాణిలోనే కాకుండా.. ప‌ని దినాల్లో మ‌ధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంట‌ల వ‌ర‌కూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీక‌రిస్తున్నట్టు క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ఫిర్యాదుల‌కే స్పంద‌న క‌రువా అని అనిరుధ్‌రెడ్డి ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టు వ‌చ్చిన వార్తల నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఈ వివ‌ర‌ణ ఇచ్చారు.

Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

ఫిర్యాదుల‌పై వెంట‌నే చ‌ర్య..

ప్రజ‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌పై హైడ్రా వెంట‌నే స్పందిస్తుంది. నేరుగా క్షేత్రస్థాయిలో ప‌రిశీలించి చ‌ర్యలు తీసుకుంటోంది. ఫిర్యాదుల‌పై హైడ్రా వెంట‌నే స్పందిస్తుంద‌ని ప్రజ‌లు గ్రహించారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తే ద‌శాబ్దాల‌ స‌మ‌స్యలకు కూడా వెంట‌నే ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ప్రజ‌లు న‌మ్ముతున్నారు. ఇలా హైడ్రాకు 9800ల ఫిర్యాదులందాయి. వీటిలో చాలా వ‌ర‌కు ప‌రిష్కారమ‌య్యాయి. ప్రతి ఫిర్యాదును పార‌ద‌ర్శకంగా, సాంకేతికంగా, క్షుణ్నంగా ప‌రిశీలించి చ‌ర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని స‌మ‌స్యలు ప‌రిష్కారానికి స‌మ‌యం తీసుకోడానికి ఇవే కార‌ణాలని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌గారు చెప్పారు.


Also Read: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి

ఫిర్యాదుల‌పై స‌మీక్ష..

ప్రతి సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల నుంచి రాత్రి వ‌ర‌కూ నిర్వహించే ప్రజావాణిలో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ స్వయంగా ఫిర్యాదుల‌ను ప‌రిశీలిస్తారు. ఫిర్యాదు దారుల ముందే గూగుల్ మ్యాప్స్‌, శాటిలైట్ ఇమేజెస్‌, స‌ర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల ఆధారంగా.. అప్పటిక‌ప్పుడే స‌మ‌స్యపై చ‌ర్చించి.. సంబంధిత అధికారుల‌కు వాటి ప‌రిష్కార బాధ్యత‌ల‌ను అప్పగిస్తారు. అక్కడితో ఆగ‌కుండా ఫిర్యాదుల ప‌రిష్కారం ఎంత‌వ‌ర‌కు వ‌చ్చింద‌నేది వారంలో రెండు రోజులు క‌మిష‌న‌ర్ స‌మీక్షిస్తారు. కొన్ని పిర్యాదుల‌పై నేరుగా క్షేత్రస్థాయిలో ప‌ర్యటించి, ప‌రిశీలించి సమస్యను పరిష్కరిస్తారు. 

Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు