Hydra: సుప్రీంకోర్టు లాయర్‌కు వార్నింగ్‌ ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలో కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఈ క్రమంలోనే ఐలాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీంకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Hydra Commissioner AV Ranganath

Hydra Commissioner AV Ranganath

హైదరాబాద్‌ (Hyderabad) లో చెరువులు, నాళాలపై అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఏర్పాటైన హైడ్రా (Hydra) మళ్లీ తన చర్యలు ప్రారంభించింది. మొదట్లో ప్రజలు నుంచి కాస్త విమర్శలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు ప్రజల మద్దతుతోనే ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాధితులు హైడ్రా కార్యాలయానికి వస్తున్నారు. దీంతో వారి ఫిర్యాదులను కమిషనర్ రంగనాథ్‌ ఆధ్వర్యంలో అధికారులు సమస్యలను పరిష్కరిస్తున్నారు.   

Also Read: పాక్‌ ముష్కరుల చొరబాటు భగ్నం.. ఏడుగురిని మట్టుబెట్టిన భారత సైన్యం

అయితే శుక్రవారం హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలో రంగనాథ్ (AV Ranganath) పర్యటించారు. ప్లాట్లు కొన్న బాధితుల ఫిర్యాదు మేరకు ప్లాట్ల వద్దకు వచ్చి బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్లాట్లను పరిశీలించి, వాళ్ల సమస్యల గురించి అడిగారు. వీటికి పరిష్కారం చూపుతానని కూడా రంగనాథ్‌ వాళ్లకి భరోసా ఇచ్చారు. అయితే ఈ క్రమంలోనే ఐలాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి, సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం, అలాగే కమిషనర్ రంగనాథ్ మధ్య సీరియస్ చర్చ జరిగింది. 

Also Read :  మెగా ఈవెంట్ లోడింగ్.. 'లైలా' ప్రీ రిలీజ్ చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా!

రంగనాథ్ బాధితుల సమస్యలు వింటుండగా సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం జోక్యం చేసుకున్నారు. కోర్టు పరిధిలో ఉన్న వాటిని చూసేందుకు ఎందుకు వచ్చారంటూ రంగనాథ్‌ను ప్రశ్నించారు. ప్లాట్లకు సంబంధించిన పలు ఆధారాలను ఆయనకు చూపించారు. మీరు తెలుగు చదువుతారు కదా అంటూ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన రంగనాథ్ నేను తెలుగు చదువుతా అన్ని చదువుతా.. ఎక్కువ మాట్లాడకుంటా చెప్పాల్సింది చెప్పండని సీరియస్ అయ్యారు. ఓవర్ యాక్షన్ చేయకండి అనవసరంగా ఇబ్బందులు పడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

AV Ranganath Serious Warning To Supreme Court Lawyer

Also Read: మనుషులా మానవ మృగాలా.. రన్నింగ్ ట్రైన్లో 4 నెలల గర్భిణిని ఇద్దరు కీచకులు.. ఛీ ఛీ!

హైడ్రా అనేది ప్రజల ఆస్తులు కాపాడేందుకు, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే పనిచేస్తుందని రంగనాథ్ అన్నారు. కోర్టులు, చట్టాలను ఎలా గౌవించాలో తమకు తెలుసని పేర్కొన్నారు. చట్టాలు అందులో ఉన్న విషయాలను అర్థం చేసుకునే తాము ఈ పని చేస్తున్నామంటూ వార్నింగ్ ఇచ్చారు. రంగనాథ్‌ ఆ లాయర్‌కు వార్నింగ్ ఇవ్వడంతో అక్కడి స్థానికులు చప్పట్లు కొట్టి ప్రశంసించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

Also Read :  కేటీఆర్ కు జైలు ఇప్పట్లో లేనట్లే.. ఢిల్లీ టూర్‌లో సీఎం రేవంత్ సంచలన ప్రకటన!

Advertisment
Advertisment
తాజా కథనాలు