Paddy crop: నీరు లేకుండానే వరి సాగు.. హైదరాబాద్‌ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి!

వరి సాగులో హైదరాబాద్ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. కరువును తట్టుకుని అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టించారు. DRR ధన్‌ 100 (కమల) వరి రకం 30శాతం అధిక దిగుబడినిస్తుంది. అన్నింటికంటే 20 రోజుల ముందే కోతకు వస్తుందని రాజేంద్రనగర్‌ IIRR తెలిపింది.

New Update
iirr hyd

Hyderabad iirr scientists achieved miracle rice cultivation

Paddy crop: వరి సాగులో హైదరాబాద్ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. కరువును తట్టుకుని అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టించారు. DRR ధన్‌ 100 వరి రకం 30శాతం అధిక దిగుబడినిస్తుందని రాజేంద్రనగర్‌ ఐఐఆర్‌ఆర్‌ తెలిపింది. ఈ పూసా రైస్‌ డీఎస్‌టీ1 గా చెప్పుకునే వరివంగడం కరువు, చౌడును తట్టుకుని నిలబడుతుంది. అన్నింటికంటే ఇది 20 రోజులు ముందే చేతికొస్తుందని, ఇది రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. 

ప్రపంచంలోనే తొలి ప్రయోగం..

ఈ మేరకు  క్రిస్పర్‌–కాస్‌9 అనే జీనోమ్‌–ఎడిటింగ్‌(GE) సాంకేతికతతో అభివృద్ధి చేసిన రెండు వరి వంగడాలను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే తొలి జన్యు సవరణ వరి రకంగా పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, భూతాపం తట్టుకుని అధిక దిగుబడిని ఇస్తుందని చెప్పారు. 

ఇది కూడా చదవండి: ఆ వ్యాధులు ఉన్నవారు పుచ్చకాయ తింటే డేంజర్.. ఈ విషయాలు మీకు తెలుసా?

'దేశంలో ప్రజాదరణ పొందిన సాంబ మసూరి (BPT–5204) వంగడానికి జన్యుసవరణ చేసి ‘DRR ధన్‌ 100 (కమల)’ రకాన్ని అభివృద్ధి చేశాం. ‘క్రిస్పర్‌’ను వినియోగించి సాంబ మసూరిలోని సైటోకినిన్‌ ఆక్సిడేస్‌ జన్యువుకు సవరణ చేశాం. సుమారు 3 ఏళ్లు పట్టింది. 2 ఏళ్లు వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరీక్షలు చేశాం. ప్రస్తుతం మావద్ద ఈ రకానికి సంబంధించి మూల విత్తనాలు ఉన్నాయి. విత్తనాల విడుదలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం. 19 శాతం పెరుగుదలతోపాటు 20 రోజుల ముందే పరిపక్వతకు వచ్చింది. ఈ వరి బలమైన కాండాలను కలిగివుండటంతో కరువును తట్టుకుని నిలబడుతుంది' అని డాక్టర్ సతేంద్ర కుమార్ మంగ్రౌతియా స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!

hyderabad | scientist | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు