/rtv/media/media_files/2025/06/17/O302xVnl8gr6qp9qMZKk.jpg)
Wife Attacks Husband
Hyderabad: భార్యను హింసించిన భర్త...భార్యను హత్యచేసిన భర్త..భార్యపై దాడిచేసిన భర్త...మొగుడు కాదు యముడు...ఇవన్నీ ఒకపుడు ప్రధాన హెడ్డింగ్స్. కాలం మారింది. ఇప్పుడు సీనంతా రివర్స్ అయింది. భార్యలంటేనే భర్తలు వణికిపోతున్నారు. భర్తల పాలిట యుములుగా మారుతున్నారు భార్యలు. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఇవే ఘటనలు. భర్త ఉండగానే మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న భర్తను కాటికి పంపడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సోనమ్ అనే యువతి పెళ్లైన నాలుగు రోజులకే భర్తను హనీమూన్కు తీసుకెళ్లి ప్రియుడు, కిరాయి హంతుకులతో చంపించింది. ఇదే కాదు మీరట్లో భర్త ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టి సిమెంట్తో కప్పేసింది. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ప్రతిరోజు ఏదో ఒక చోట చూస్తూనే ఉన్నాము.
Also Read: చంపేస్తా.. పట్టపగలు ఛాతిపై తుపాకి ఎక్కుపెట్టి యువతి రచ్చ.. వీడియో వైరల్!
తాజాగా హైదరాబాద్లో ఇలాంటి ఘటనే కలకలం సృష్టించింది. ఆసిఫ్ నగర్లో ప్రియుడితో కలిసి భర్తపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది భార్య. షైస్తాను అనే మహిళకు ఓసామా అనే వ్యక్తితో ఏడాది క్రితం పెళ్లయింది. అయితే ఆరునెలల పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. అదే సమయంలో షైస్తానుకు అమీర్ అనే మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో అతనితో అక్రమసంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే భర్త ఓసామాను ఉద్యోగం పేరుతో ఆరునెలల క్రితం దుబాయ్కి పంపించింది. భర్త దుబాయ్కి వెళ్లగానే అమీర్తో సహజీవనం మొదలు పెట్టింది. దుబాయ్ నుంచి ఓసామా ఇటీవల తిరిగి వచ్చాడు. వచ్చాక అమీర్తో తన భార్యకు ఉన్న అక్రమ సంబంధం గుట్టు బయటపడింది. ఈ విషయమై భార్యను నిలదీశాడు.
Also read: ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
విషయం భర్తకు తెలియడంతో భర్తను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలనుకుంది షైస్తాను. తన ప్రియుడి సహాయంతో సుపరిగ్యాంగ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రియుడితో కలసి వారంతా ఓసామాపై దాడి చేయడంతో ఒసామా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా దాడిచేసిన భార్యతో పాటు ప్రియుడు గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also read: అర్జున్ బార్క్ టీ తాగడం వల్ల ఏమవుతుంది? తప్పక తెలుసుకోండి