Supreme Court : రెండేళ్లు బయట చదివితే స్థానికత వర్తించదంటే ఎలా? స్థానికత వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టులో ఈరోజు సుదీర్ఘ విచారణ కొనసాగింది. స్థానికులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదవకపోయిన స్థానిక కోటా వర్తిస్తుందన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

New Update
Supreme Court

Supreme Court

Supreme Court: తెలంగాణ స్థానిక కోటాపై సుప్రీంకోర్టులో ఈరోజు సుదీర్ఘ విచారణ కొనసాగింది. స్థానికులు నాలుగేళ్లు వరుసగా తెలంగాణలో చదవకపోయిన స్థానిక కోటా వర్తిస్తుందన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పదో తరగతి తర్వాత రెండేళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై  పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు సీజేఐ బీఆర్‌ గవాయ్‌ మాట్లాడుతూ 10వ, 11వ తరగతులకే బయటకు వెళ్లిన విద్యార్థులకు అన్యాయం చేయరాదని వ్యాఖ్యానించారు.దుబాయ్ లాంటి ప్రాంతాలకు ఇంటర్ చదువుకోడానికి వెళ్లిన విద్యార్థులకు స్థానిక కోటా వర్తించదంటే ఎలా అని సీజేఐ ప్రశ్నించారు. 

Also Read : లవ్ మ్యారేజ్ చేసుకున్నారని.. గ్రామస్థులంతా కలిసి సంచలన నిర్ణయం!

తెలంగాణలో పుట్టిన విద్యార్థి ఇక్కడే చదివి.. ఆ తర్వాత 2 సంవత్సరాలు బయట చదివినంత మాత్రాన తెలంగాణ కోటా వర్తించదంటే ఎలా అంటూ ఆయన నిలదీశారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఎటూ స్థానిక కోటా కిందకు రారని సీజేఐ స్పష్టం చేశారు. నాలుగు సంవత్సరాల చదువు లేదా నివాసం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానికత ఖరారు చేసిందని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సింఘ్వీ న్యాయస్థానానికి వివరించారు. దీనిపై స్పందించిన సీజేఐ 2024లో తీసుకువచ్చిన నిబంధనను 2028కి వర్తింపజేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. స్థానికత పేరుతో తెలంగాణ విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదని సీజేఐ బీఆర్ గవాయ్ అభిప్రాయ పడ్డారు.

కాగా ఈ విషయమై గతంలోనే విద్యార్థుల పిటిషన్‌పై విచారించి.. తగిన నిబంధనలు రూపొందించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. స్థానికత అంటే ఏమిటి? ఎవరు దీని పరిధిలోకి వస్తారు? అందుకు ఉన్న పరిమితులపై మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది.  ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.  రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌  న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. రెండేళ్లు బయటి ప్రాంతంలో చదువుకోవడానికి వెళితే తప్పేంటని విచారణ సందర్భంగా సీజేఐ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పదేళ్లు స్థానికంగా ఉండి.. రెండేళ్లు బయటకు వెళ్లినంతమాత్రాన స్థానికత ఎలా కోల్పోతారని సీజేఐ ప్రశ్నించారు. 2014లో నిబంధనలు తీసుకొచ్చారు.. అప్పుడు ఈ రెండు, నాలుగేళ్ల సమయం గురించి అందులో ప్రస్తావించారా అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. 2024లో తీసుకొచ్చిన నిబంధనను 2028కి వర్తింపజేస్తే సరిపోతుందని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. స్థానికత నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదని   సందర్భంగా సీజేఐ అభిప్రాయ పడింది.

ఇది కూడా చదవండి:మోదీ తర్వాత అమిత్ షా రికార్డ్..ఆయనకు మాత్రమే సొంతం

‘‘ ఒక విద్యార్థి తెలంగాణలో పుట్టి పెరిగి.. ఒక రెండేళ్లు బయట చదువుకున్నంత మాత్రాన కోటా వర్తించదంటే ఎలా? ప్రతి విద్యార్థి 371డి అధికరణం గురించి తెలుసుకోవాలన్నట్టుగా  మీ వాదనలు ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిరక్ష రాస్యులైన తల్లిదండ్రులు ఉంటే.. 8వ తరగతిలోనే రాజ్యాంగం గురించి తెలుసుకోవాలన్న విధంగా మీ వాదనలు ఉన్నాయి’’ అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. పలు రాష్ట్రాల్లో స్థానికత వ్యవహారం వేర్వేరుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీవివరించారు... అస్సాంలో 7 సంవత్సరాల నిబంధన ఉందని అభిషేక్‌ సింఘ్వీ గుర్తు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో పేద, మధ్యతరగతి వాళ్లకు జరుగుతున్న ఉపయోగాన్ని విస్తృత కోణం నుంచి చూడాలని, అందుకు తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. వాదనల అనంతరం తీర్పు రిజర్వు చేస్తున్నట్టు సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి:ఏం చేయాలో మాకు తెలుసు..అమెరికాకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన భారత్

Advertisment
తాజా కథనాలు