/rtv/media/media_files/2025/08/05/punajb-2025-08-05-09-16-31.jpg)
పంజాబ్లోని చండీగఢ్ నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోహాలీ జిల్లాలో ఉన్న మనక్పూర్ షరీఫ్ అనే గ్రామం ఇటీవల ఒక వివాదాస్పద తీర్మానాన్ని ఆమోదించింది. జూలై 31న ఏకగ్రీవంగా ఆమోదించబడిన ఈ తీర్మానంలో తల్లిదండ్రుల లేదా కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ప్రేమ వివాహాలు చేసుకునే వారిని గ్రామం నుంచి వెలివేయాలని పేర్కొన్నారు. కుటుంబ అనుమతి లేకుండా కోర్టు వివాహం చేసుకున్న లేదా పారిపోయి పెళ్లి చేసుకున్న ఏ యువకుడు లేదా యువతిని గ్రామంలో నివసించడానికి అనుమతించరని గ్రామస్థులంతా తీర్మానిచ్చారు. అటువంటి జంటలకు ఆశ్రయం కల్పించే లేదా వారికి సహాయం చేసే గ్రామస్తులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని నిర్ణయం తీసుకున్నారు.
Ban on love marriages: A strict decision by the panchayat to impose a ban on love marriages in the village of Kotshamir, Punjab.https://t.co/x6Rg858NS1#TransformingBihar#IICT#NikitaRoyInCinemas#GetBlessings#LoveMarriageBan#NoLoveMarriage#PanchayatDecision…
— Newz24india.com (@newz24ind) July 18, 2025
గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ
దీనిపై ఆ గ్రామ సర్పంచ్ దల్వీర్ సింగ్ ఈ నిర్ణయం గురించి మాట్లాడుతూ.. ఇది కుటుంబ విలువలను, సంప్రదాయాలను కాపాడటానికే అని తెలిపారు. ఇది శిక్ష కాదని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకున్న నివారణ చర్య మాత్రమే అని వివరించారు. ఈ తీర్మానంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ప్రేమ వివాహాలు చేసుకునే హక్కును ఇది హరిస్తుందని మానవ హక్కుల కార్యకర్తలు , కొంతమంది రాజకీయ నాయకులు విమర్శించారు.
Also Read : మందుల ధరలు తగ్గాయి: పేద, మధ్యతరగతికి కేంద్రం ఊరట
మోహాలీ జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ (గ్రామీణ) సోనమ్ చౌదరి ఈ విషయంపై స్పందిస్తూ, ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు రాలేదని, ఒకవేళ ఫిర్యాదు వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యక్తులు పెద్దవారైతే తమకు నచ్చిన వారిని వివాహం చేసుకునే చట్టబద్ధమైన హక్కు వారికి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల 26 ఏళ్ల దవీందర్ అనే వ్యక్తి తన 24 ఏళ్ల మేనకోడలు బేబీని ప్రేమ వివాహం చేసుకున్న సంఘటన తర్వాత ఈ తీర్మానం తీసుకురాబడిందని ఆయన వివరించారు. అప్పటి నుండి ఈ జంటను గ్రామం నుంచి వెలివేశారు, అయితే ఈ సంఘటన ఇక్కడ నివసిస్తున్న 2,000 మంది గ్రామస్తులపై ప్రభావం చూపుతోంది.
ఇవి తాలిబానీ ఆదేశాలు
దీనిపై పాటియాలా కాంగ్రెస్ ఎంపీ ధరంవీర గాంధీ ఈ తీర్మానాన్ని ఖండిస్తూ, దీనిని తాలిబానీ ఆదేశాలు అని అభివర్ణించారు. జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ప్రాథమిక హక్కు అని అన్నారు. పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాజ్ లల్లి గిల్ ఈ తీర్మానాన్ని రాజ్యాంగ విరుద్ధమన్నారు. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
Also Read : మోదీ తర్వాత అమిత్ షా రికార్డ్..ఆయనకు మాత్రమే సొంతం
telugu-news | love-marriage | latest-telugu-news | national news in Telugu