/rtv/media/media_files/2025/04/17/X9xiy8PDfHXOEs5I0eAY.jpg)
Raj Thackeray
Raj Thackeray : దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అసలే భాషాభిమానం ఎక్కువ గల తమిళనాడు దీన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది, అయితే ఈ వివాదం ఇప్పుడు మహారాష్ర్టను కూడా తాకింది. స్కూళ్లలో హిందీ అమలు చేయాలన్న అంశంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మండిపడ్డారు. మూడో భాషగా హిందీని స్కూళ్లలో అమలు చేసే నిర్ణయంపై మహారాష్ట్ర రాజ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేం హిందువులం. హిందీ కాదు’ అని అన్నారు.
Also Read: వేసవిలో తరచుగా కడుపునొప్పి వస్తుందా?. ఇది తెలుసుకోండి
హిందీ భాషా వివాదం తమిళనాడు నుంచి మహారాష్ట్రకు చేరింది. మూడో భాషగా హిందీని స్కూళ్లలో అమలు చేసే నిర్ణయంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మండిపడ్డారు. ‘మేం హిందువులం. హిందీ కాదు’ అని అన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరిగా మూడవ భాషగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ‘మేం హిందువులం. కానీ హిందీ కాదు. మహారాష్ట్రకు హిందీ రంగు వేయడానికి మీరు ప్రయత్నిస్తే, రాష్ట్రంలో పోరాటం ఖాయం. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం కావాలనే ఈ పని చేస్తోందని అర్థమవుతుంది. రాబోయే ఎన్నికల్లో మరాఠీ, మరాఠీయేతరుల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలనే ప్రయత్నమా ఇదంతా?’ అని ప్రశ్నించారు.
Also Read: బాలయ్య బర్త్ డేకి సర్ప్రైజ్ గిఫ్ట్.. ఫ్యాన్స్ కి పండగే..!
కాగా, హిందీ జాతీయ భాష కాదని రాజ్ ఠాక్రే అన్నారు. అలాంటప్పుడు మహారాష్ట్రలోని విద్యార్థులకు ప్రాథమిక స్కూళ్లలో హిందీని ఎందుకు బోధించాలి అని నిలదీశారు. ‘మీ త్రిభాషా ఫార్ములాను ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితం చేయండి. విద్యలోకి తీసుకురావద్దు. ఈ దేశంలో భాషా ప్రాంతీయకరణ జరిగింది. చాలా ఏళ్లుగా ఇది కొనసాగుతున్నది. ఇప్పుడు మహారాష్ట్రపై మరొక ప్రాంతం భాషను ఎందుకు రుద్దుతున్నారు? భాషా ప్రాంతీయకరణ సూత్రం దెబ్బతింటుంది’ అని ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని