Telangana: తెలంగాణ వాసులకు బిగ్ అలెర్ట్.. 5 రోజులు మండే ఎండలు...!

తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. ఇంకో ఐదు రోజుల పాటు ఎండలు, వేడి గాలులతో ఇబ్బంది పడాల్సిందేనని.. ఆ తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

New Update
Weather Alert : వేసవి కాలం.. వివిధ ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం..

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. కాగా.. వచ్చే పది రోజుల్లో తెలంగాణలో కాస్త భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడబోతున్నట్టు తెలంగాణ వాతావరణ నిపుణలు చెప్తున్నారు.

Also Read: Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!

ఈ నేఫథ్యంలోనే.. తెలంగాణ వాతావరణశాఖ అధికారులు  కీలక అప్డేట్ అందించారు. మార్చి 19 వరకు వేడిగాలుల బాధలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే.. మార్చి 20 నుంచి 24 తేదీల్లో మాత్రం రాష్ట్రంలో అకాల వర్షాలు కురిస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అవి కూడా బలమైన ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని చెప్పారు. అయితే.. ఈ వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుందని కూడా పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుతానికి మాత్రం వేడికి బాధపడాల్సిందేనని.. మార్చి 20 తర్వాత మాత్రం రైతులు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: Tushar Gandhi: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...

అయితే.. ఈ వార్త మండే ఎండలతో ఇబ్బంది పడుతున్న సాధారణ ప్రజలకు కాస్త ఉపశమనం కలింగించేదే అయినా.. ఉరుములు, మెరుపులతో కురిసే అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉంది. దీంతో.. ఆ రోజుల్లో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు అంటున్నారు.

మరోవైపు.. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా ఉష్ణోగ్రతలపై కీలక అప్డేట్ ఇచ్చారు. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా.. ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసీఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం కూడా గట్టిగానే ఉంటుదని అధికారులు చెప్తున్నారు. అయితే.. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలెర్ట్ జారీ చేసినట్లు సమాచారం.

ఇక.. శనివారం (మార్చి 15న) గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్న అధికారులు.. ఇంకో 7 జిల్లాలకు కూడా ఎల్లో అలెర్ట్ జారీ చేయనున్నట్టు తెలిపారు. అయితే.. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also Read: Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు!

Also Read: Punjab: స్వర్ణదేవాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తి హల్ చల్..ఐదుగురికి గాయాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు