/rtv/media/media_files/2025/06/26/raghunandan-rao-2025-06-26-19-29-47.jpg)
Raghunandan Rao
Raghunandan Rao : మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్రావుకు సెక్యూరిటీ పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఇటీవల మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ రావడంతో దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అదే సమయంలో రఘునందన్రావుకు భద్రత అవసరమని పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో సాయుధ పోలీసులతో కూడిన ఎస్కార్ట్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మధ్యప్రదేశ్ నుంచి కాల్..
కాగా ఇటీవల రఘునందన్ రావు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కీన్ పాఠశాలలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయనకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ‘ఈరోజు సాయంత్రం లోగా నిన్ను చంపుతాం అని ఫోన్లో ఆగంతకుడు బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్లు సమాచారం. బెదిరింపు కాల్తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘునందన్ ఫిర్యాదుతో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భద్రత పెంచమని..
ఈ క్రమంలో తనకు ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేయాలని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసులను కోరారు. ఇందుకు సంబంధించి భద్రతను పెంచాలని తాను గత ఏడాది దరఖాస్తు చేశానన్నారు. మళ్లీ డీజీపీని కలిసి మరోసారి దరఖాస్తు ఇచ్చినట్లు చెప్పారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ డీజీపీకి మరోసారి దరఖాస్తు ఇచ్చానన్నారు. తాను ఇచ్చిన దరఖాస్తుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడిగితే, అధికారుల నుండి మౌనమే సమాధానంగా వచ్చిందన్నారు. కాగా ఈ విషయంలో స్పందించిన పోలీసులు ఆయనకు అదనపు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : ఏడు రోజులు వరుసగా పచ్చి ఏలకులు తింటే ఏమవుతోందో తెలుసా?
Also Read: అంతరిక్షంలో ఆరోగ్యం బాగోలేదన్న ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా