/rtv/media/media_files/2025/06/07/5eTFVohdbv6KDBFb65Zj.jpg)
Railway accident
TG Crime: ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. నిండు నూరేళ్లు భార్యాబిడ్డలతో కలిసి బతకాలని ఆశించిన వ్యక్తి ప్రాణాలు అనకోకుండా గాలిలో కలిశాయి. పెళ్లయిన మూడు నెలలకే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. భార్యతో కలిసి హనీమూన్(honeymoon)కు బయలు దేరిన యువకుడు అర్థంతరంగా తనువు చాలించాడు. కండ్లముందే భర్త కనుమూయడంతో నూతన వధువు గుండెలవిసేలా రోదిస్తోంది.
Also Read: ఛత్తీస్గఢ్లో ఎన్ కౌంటర్, మరో ఇద్దరు మావోయిస్టులు మృతి
వరంగల్(warangal) పట్టణానికి చెందిన ఉరగొండ సాయి స్థానికంగా ఉన్న గిప్ట్ ఆర్టికల్స్ తయారు చేసే కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయనకు మూడు నెలల క్రితం పెళ్లైంది. కాగా ఈ సందర్భంగా భార్యతో కలసి సాయి హనీమూన్కు గోవా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రైలు టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు. శుక్రవారం రోజున ఆనందంగా గోవాకు బయలు దేరారు. సాయితో పాటు భార్య, బావమరిది, మరి కొందరు స్నేహితులతో కలిసి సికింద్రాబాద్(secndrabad) రైల్వేస్టేషన్కు చేరుకున్నాడు. అప్పటికే రైలు ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఉంది. దీంతో సాయితో పాటు అందరూ రైలు ఎక్కి కూర్చున్నారు. అయితే ట్రైన్ కదలడానికి మరికొంత సమయం ఉండటంతో.. నీళ్ల బాటిల్ కొనడం కోసం సాయి కిందకు దిగాడు.
Also Read: వాట్సాప్ కు పోటీగా ఎక్స్ చాట్..మస్క్ మరో ప్లాన్
సాయి నీళ్లబాటిల్ తీసుకుని వచ్చేలోపు రైలు కదిలింది. అయితే సాయి రాకపోవడంతో రైలులో ఉన్న అతడి స్నేహితులు చైన్ లాగి ట్రైన్ ఆపారు. రైలు ఆగడంతో.. ఆర్పీఎఫ్ పోలీసులు సాయి స్నేహితులు ఉన్న బోగిలోకి వెళ్లి.. చైన్ ఎందుకు లాగారని ప్రశ్నించారు. వారు విషయం చెప్పినప్పటికీ.. పోలీసులు వినలేదు, పైగా వారిని బోగి నుంచి ప్లాట్ఫామ్ మీదకు తీసుకువచ్చి విచారిస్తున్నారు. ఈ లోపు వాటర్ బాటిల్ తీసుకుని వచ్చిన సాయికి ఈ విషయం తెలియక రైలు ఎక్కాడు. బోగిలో స్నేహితులు లేకపోవడంతో ఏమైందని అక్కడున్న భార్య, బావామరిదిని అడిగాడు. వారిని పోలీసులు తీసుకువెళ్లారు అని చెప్పడంతో వారి దగ్గరకు వెళ్లాడు.
పోలీసుల దగ్గరకు వెళ్లి తన ఫ్రెండ్స్ని వదిలిపెట్టమని.. చైన్ లాగినందుకు ఫైన్ చెల్లిస్తామని బతిమిలాడాడు సాయి. రైలు వెళ్లిపోతుందని పోలీసులను వేడుకున్నాడు. కానీ వారు అందుకు అంగీకరించలేదు. ఈ లోపు ట్రైన్ తిరిగి కదిలింది. అయితే సాయి భార్య, బావమరిది ట్రైన్లో ఉండటంతో.. వారి కోసం రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. రైలు వేగం ఎక్కువగా ఉండటంతో కాలు జారి రైల్వే ప్లాట్ఫాం, పట్టాలకు మధ్యలో పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సాయి మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ది అమెరికా పార్టీ.. ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పేరు ఇదే..
Also Read: ఉక్రెయిన్ను చావుదెబ్బ కొట్టిన రష్యా.. వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడులు