ఇటీవల ఉక్రెయిన్పై తీవ్రంగా స్పందిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్.. ట్రంప్కు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఆ సమయం రానేవచ్చింది. తాజాగా ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకుపడింది. 400లకు పైగా డ్రోన్లు, 40 క్షిపణులతో దాడులు చేసింది. కీవ్, ఎల్విన్, సుమీతో పాదు ఇతర ప్రధాన నగరాలపై ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందారు. కీవ్లో ముగ్గురు ఫైర్ సిబ్బంది, లూట్స్క్లో ఇద్దరు, చెర్నిహివ్లో ఒకరు మృతి చెందారు. అలాగే మరో 80 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే..
💥 Breaking News 💥
— YARA (@This_is_Yara_) June 7, 2025
No military targets. Almost the center of Kyiv. It’s so crazy.
Many people lost everything. 3 people died in Kyiv. 3 people died in other cities. About 6 dozen injured. No words.#RussiaUkraineWar #Ukraine️ #UkraineRussiaWar #Russia #kyivattack pic.twitter.com/NU2aDZEFUu
Also Read: చిలికి చిలికి గాలి వాన..ట్రంప్, మస్క్ ల మధ్య ఎప్పటి నుంచో భేదాలు
ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యా చేసే దాడులపై ప్రపంచ దేశాలు స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు రష్యా దాడులను ప్రపంచ దేశాలు ఖండించకపోవడం వల్లే పుతిన్ దీన్ని అవకాశంగా తీసుకొని దాడులు చేస్తున్నారని జెల్న్స్కీ ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు ప్రపంచ ఐక్యతను రష్యా దెబ్బతీస్తోందని.. కాల్పుల విరమణ కోసం ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిస్తున్నారు.
ఇటీవల రష్యాపై ఉక్రెయిన్ 117 డ్రోన్లతో దాడులు చేసినట్లు పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 41 రష్యా యుద్ధ విమానాలు ధ్వంసం చేశామని పేర్కొన్నారు. ఆ తర్వాత రష్యా కూడా ఉక్రెయిన్పై డ్రోన్లతో దాడులకు దిగింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుతిన్తో మాట్లాడారు. ఆ సమయంలో ఉక్రెయిన్పై తాము తీవ్రంగా స్పందిస్తామని పుతిన్ స్పష్టం చేశారు. దీంతో తాజాగా ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లతో విరుచుకుపడటం సంచలనం రేపుతోంది.