కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంపై వివక్ష చూపట్లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో గట్టిగా చెప్పారు. బడ్జెట్లో ఏ ఒక్క రాష్ట్రానికి పెద్దపీట వేయట్లేదని వివరించారు. బడ్జెట్కు ముందు అన్ని రాష్ట్రాలను సంప్రదిస్తున్నామని రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సభ్యులకు వివరించారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నామని, పీఎం గతిశక్తి ద్వారా రాష్ట్రాల మధ్య అసమానతల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
Also Read: USA: సుంకాలపై ఇవాళో, రేపో కీలక నిర్ణయం..ట్రంప్ వ్యాఖ్యలు
బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు మాట్లాడటం సరికాదని నిర్మలా సీతారామన్ అన్నారు. తన ప్రసంగాన్ని అడ్డుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి లెక్కలతో సహా తెలంగాణకు నిధుల కేటాయింపులను ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిన విషయం వాస్తవమని, ఎన్ని చర్యలు చేపట్టినా అప్పుల్లో కూరుకుపోతోందని ఆమె ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read:America: అమెరికా నుంచి మరో రెండు విమానాల్లో భారతీయులు..మండిపడుతున్న పంజాబ్!
విభజన హామీల కింద తెలంగాణలో వెనుకబడిన 9 జిల్లాలకు రూ.2,700 కోట్లు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. అయినా కూడా మెదక్ జిల్లాలో మొదటి రైల్వేస్టేషన్ను మోడీ సర్కారే ఇచ్చిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను, ప్రయోజనాలను రాజ్యసభలో లెక్కలతో సహా ప్రకటించారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, నిజామాబాద్లో పసుపు బోర్డు, వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, మెదక్ జహీరాబాద్లో ఇండస్ట్రియల్ నోడల్ పాయింట్, ములుగులో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ, బీబీనగర్లో ఎయిమ్స్ ఆసుపత్రి లాంటివి మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
2014 నుంచి తెలంగాణలో 2,605 కిలో మీటర్ల మేర హైవేల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. భారత్మాల కింద 4 గ్రీన్ఫీల్డ్ కారిడార్లు నిర్మించామని, ఈ ఏడాది తెలంగాణలో రైల్వేకు రూ.5,337 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎర్రుపాలెం-నంబూరు, మల్కన్గిరి-పాండురంగాపురం మధ్య కొత్త రైల్వేలైన్లు మంజూరుతో సహా, తెలంగాణకు ఐదు వందేభారత్ రైళ్లు ఇచ్చామన్నారు. 2014 నుంచి 753 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్లు నిర్మించినట్లు తెలిపారు.
అమృత్ భారత్ పథకం...
అంతేకాకుండా తెలంగాణలో అమృత్ భారత్ పథకం కింద 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. పీఎం ఆవాస్ యోజన పథకంలో పట్టణాల్లో 2 లక్షల ఇళ్లు, స్వచ్ఛభారత్ కింద 31 లక్షల మరుగుదొడ్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఇవే కాకుండా ప్రజలకు తాగునీరు అందించాలని జల్జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. 82 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు
Also Read: Modi-Trump: ట్రంప్ తో మోదీ భేటీ..ఏ విషయాలు గురించి చర్చించుకున్నారంటే!
Also Read: Horoscope: ఈ రాశి వారు రోజు శుభవార్తలు అందుకుంటారు..అంతా మంచే జరుగుతుంది!
Telangana: తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిన విషయం నిజమే..నిర్మలా సీతారామన్!
కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంపై వివక్ష చూపట్లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పారుతన ప్రసంగాన్ని అడ్డుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి లెక్కలతో సహా తెలంగాణకు నిధుల కేటాయింపులను వివరించారు.
Nirmala Sitharaman
కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంపై వివక్ష చూపట్లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో గట్టిగా చెప్పారు. బడ్జెట్లో ఏ ఒక్క రాష్ట్రానికి పెద్దపీట వేయట్లేదని వివరించారు. బడ్జెట్కు ముందు అన్ని రాష్ట్రాలను సంప్రదిస్తున్నామని రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సభ్యులకు వివరించారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నామని, పీఎం గతిశక్తి ద్వారా రాష్ట్రాల మధ్య అసమానతల తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
Also Read: USA: సుంకాలపై ఇవాళో, రేపో కీలక నిర్ణయం..ట్రంప్ వ్యాఖ్యలు
బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు మాట్లాడటం సరికాదని నిర్మలా సీతారామన్ అన్నారు. తన ప్రసంగాన్ని అడ్డుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను ఉద్దేశించి లెక్కలతో సహా తెలంగాణకు నిధుల కేటాయింపులను ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిన విషయం వాస్తవమని, ఎన్ని చర్యలు చేపట్టినా అప్పుల్లో కూరుకుపోతోందని ఆమె ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read:America: అమెరికా నుంచి మరో రెండు విమానాల్లో భారతీయులు..మండిపడుతున్న పంజాబ్!
విభజన హామీల కింద తెలంగాణలో వెనుకబడిన 9 జిల్లాలకు రూ.2,700 కోట్లు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. అయినా కూడా మెదక్ జిల్లాలో మొదటి రైల్వేస్టేషన్ను మోడీ సర్కారే ఇచ్చిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను, ప్రయోజనాలను రాజ్యసభలో లెక్కలతో సహా ప్రకటించారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, నిజామాబాద్లో పసుపు బోర్డు, వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, మెదక్ జహీరాబాద్లో ఇండస్ట్రియల్ నోడల్ పాయింట్, ములుగులో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ, బీబీనగర్లో ఎయిమ్స్ ఆసుపత్రి లాంటివి మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
2014 నుంచి తెలంగాణలో 2,605 కిలో మీటర్ల మేర హైవేల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. భారత్మాల కింద 4 గ్రీన్ఫీల్డ్ కారిడార్లు నిర్మించామని, ఈ ఏడాది తెలంగాణలో రైల్వేకు రూ.5,337 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎర్రుపాలెం-నంబూరు, మల్కన్గిరి-పాండురంగాపురం మధ్య కొత్త రైల్వేలైన్లు మంజూరుతో సహా, తెలంగాణకు ఐదు వందేభారత్ రైళ్లు ఇచ్చామన్నారు. 2014 నుంచి 753 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్లు నిర్మించినట్లు తెలిపారు.
అమృత్ భారత్ పథకం...
అంతేకాకుండా తెలంగాణలో అమృత్ భారత్ పథకం కింద 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. పీఎం ఆవాస్ యోజన పథకంలో పట్టణాల్లో 2 లక్షల ఇళ్లు, స్వచ్ఛభారత్ కింద 31 లక్షల మరుగుదొడ్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఇవే కాకుండా ప్రజలకు తాగునీరు అందించాలని జల్జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్లా కనెక్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. 82 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చామని నిర్మలా సీతారామన్ తెలిపారు
Also Read: Modi-Trump: ట్రంప్ తో మోదీ భేటీ..ఏ విషయాలు గురించి చర్చించుకున్నారంటే!
Also Read: Horoscope: ఈ రాశి వారు రోజు శుభవార్తలు అందుకుంటారు..అంతా మంచే జరుగుతుంది!