USA: సుంకాలపై ఇవాళో, రేపో కీలక నిర్ణయం..ట్రంప్ వ్యాఖ్యలు

పలు దేశాలపై విధిస్తున్న సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలు పెంచాలా లేదన్న దానిపై ఒకటి , రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రధాని మోదీతో భేటీ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

author-image
By Manogna alamuru
New Update
Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు ట్రంప్ బాధ్యతలు తీసుకుని ఇప్పటికి మూడు వారాలు గడిచింది. ఈ త్రీ వీక్స గొప్పగా నడిచాయని ట్రంప్ అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ను సాధించి తీరుతామని చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ పెట్టారు. దాంతో పాటూ ఇవాళ, రేపటిలోగా పలు దేశాలపై విధిస్తున్న సుంకాల గురించి కీలక నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ తెలిపారు. మరికొన్ని గంటల్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోదీతో భేటీలో ఈ విషయం చర్చకు తప్పనిసరిగా రావచ్చని తెలుస్తోంది. 

Also Read: అయోధ్య ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ అంత్యక్రియలు.. సరయూ నదిలో జల సమాధి

మరి కాసేపట్లో ఎలాన్ మస్క్, ట్రంప్ లతో భేటీ..

ఇక మరికాసేపట్లో భారత ప్రధాని మోదీ ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ను కలవనున్నారు.  మోదీ బస చేసిన బ్లెయిర్ హౌస్ కు మస్క్ చేరుకున్నారు. అమెరికాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అతిథి గృహంలో ఆయన బస చేస్తున్నారు. 1651 పెన్సిల్వేనియా అవెన్యూలోని బ్లెయిర్‌ హౌస్‌ ఆయనకు ఆతిథ్యం ఇస్తోంది. ఇది వైట్ హౌస్ కు ఎదురుగానే ఉంటుంది.  అమెరికాలో పర్యటించే అత్యంత ప్రత్యేకమైన అతిథులు ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేస్తారు. బ్లెయిర్ హౌస్ కు దౌత్య పరంగా కూడా చాలా ప్రాధాన్యం ఉంది. దీనిని అమెరికా ఆతిథ్యానికి చిహ్నంగా భావిస్తారు. 

Also Read: మూడ్ ఆఫ్ ది నేషన్ : బెస్ట్ సీఎంగా నాలుగో స్థానంలో చంద్రబాబు

 

#trump #pm modi #today-latest-news-in-telugu #usa
Advertisment
Advertisment
తాజా కథనాలు