/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/harishrao-jpg.webp)
Harish Rao
Harish Rao : తెలంగాణ రైతు కుటుంబాలకు ధీమానిచ్చే రైతు బీమాను అటకెక్కిస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. రైతు బీమా పథకంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వమేనని ఆరోపించారు.ఏ కారణంతో అయినా, రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.దురదృష్టవశాత్తు రైతులు మరణిస్తే రైతు బీమా కింద.ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతుందన్నారు.
Also Read: లండన్లో భారత జెండాను అవమానించిన అల్లరి మూకలు.. కాళ్ల కింద నలిపేసిన వీడియో
అయితే దీనికి గాను ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాల్సి ఉందని కాగా ప్రభుత్వం ఫ్రిబ్రవరి నెలలోనే చెల్లించాల్సిన రూ. 775 కోట్ల ప్రీమియం మూడు నెలలైనా చెల్లించలేదని హరీశ్రావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతు కుటుంబాలకు శాపంగా మారుతున్నదని అన్నారు. ఇప్పటివరకు వివిధ కారణాలతో 100 మంది రైతులు మృతి చెందారని ఆయన తెలిపారు. అసలు రాష్ట్రంలో రైతు బీమా పథకం కొనసాగుతున్నదా? లేదా అటకెక్కించారా అనే అనుమానం కలుగుతుందన్నారు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు అని, యాసంగి పైసలు ఎప్పుడు ఇస్తారు.. అని మేము అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మార్చి 31 లోగా మొత్తం చెల్లిస్తామని చెప్పి మాట తప్పారని, మొత్తంగా రైతు బంధు పథకాన్ని ప్రశ్నార్థకం చేసారని దుయ్యబట్టారు. రుణమాఫీ హామీ విషయంలో మేము వెంటబడితే దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పారని, సగం మందికి కూడా రుణమాఫీ చేయకుండా రైతుల ఉసురుపోసుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: భారత్-పాక్ ఉద్రిక్తత.. క్షిపణిని ప్రయోగించిన పాకిస్థాన్
ఒకవైపు కుటుంబ పెద్దను కోల్పోయి, మరోవైపు రైతు బీమా అందక ఆ కుటుంబాలు తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నాయని చెప్పారు. ఇక రైతు కుటుంబాలకు ప్రభుత్వమే రూ. 5 లక్షలు చెల్లించి, ఎల్ఐసీ కి పెండింగ్ లో ఉన్న ప్రీమియం తక్షణం కట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.
Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?