/rtv/media/media_files/2025/05/31/fiLxJB0G70Jw1OE8IZyE.jpg)
Facebook acquaintance leads to extramarital affair in Sultanabad, Peddapalli
అక్రమ సంబంధాలు రోజు రోజుకూ విచ్చల విడిగా పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కొందరు కామ కోరికల కోసం కుటుంబాలనే దూరం చేసుకుంటున్నారు. కుటుంబం, కాపురం, పిల్లలు, పరువు గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఇలాంటి వ్యవహారాలు రోజు రోజుకూ పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఫేస్బుక్ పరిచయం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అశోక్ నగర్లో ఓ మహిళ నివాసముంటుంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భూపాలపల్లి జిల్లా దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వామికి గతంలో పెళ్లైంది. కానీ కొద్ది రోజులకే భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఇద్దరికీ ఎలాంటి పరిచయం లేదు. కానీ వీరిద్దరినీ ఫేస్బుక్ కలిపింది. ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. తరచూ మెసెజ్లు చేసుకునే వారు. ఇలా మరింత దగ్గరయ్యారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?
దీంతో ఇద్దరూ తెగించేశారు. ఆ మహిళ ఏకంగా తన ఇంటికే ఫేస్బుక్ ప్రియుడ్ని పిలిపించుకుంటూ వచ్చింది. ఈ వ్యవహారం మొత్తం ఆ వీధిలో ఉన్నవారితో పాటు ఆమె భర్తకు కూడా తెలుసు. ఇలా చేయడం తప్పు.. మానుకోమని వీధిలో వారు ఎంతో నచ్చజెప్పారు. ఆఖరికి ఆమె భర్త కూడా చెప్పీ చెప్పీ విసిగిపోయి హైదరాబాద్ వెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళ మరింత రెచ్చిపోయింది.
ఇంట్లో ఇక అడ్డు చెప్పేవారే లేకపోవడంతో ఫేస్బుక్ ప్రియుడ్ని పర్మినెంట్గా ఇంటికే రప్పించుకుంది. ఇక ఈ బాగోతాన్ని ఎన్నో రోజుల నుంచి చూస్తూ వస్తున్న కాలనీ వాసులు.. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం చితకబాది బోరింగ్కు కట్టేసి దేహశుద్ది చేశారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన సుల్తానాబాద్లో హాట్ టాపిక్గా మారింది.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
telangana-crime | Latest crime news | crime news