Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆరోజు తాగునీటి సరఫరా బంద్

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు (HMWSSB) కీలక ప్రకటన చేసింది. జనవరి 11న నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Water Tap

Water Tap

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు (HMWSSB) కీలక ప్రకటన చేసింది. జనవరి 11న ఉదయం 6 గంటల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. 24 గంటల పాటు ఈ అంతరాయం కొనసాగుతుందని పేర్కొంది. ఆ సమయంలో హియాయత్ సాగర్ రిజర్వాయర్ ఫోర్బే, మిరాలమ్ ఫిల్టర్ బెడ్స్, సెట్లింగ్ ట్యాంక్స్ అలాగే ఇన్‌లెట్ ఛానెల్స్‌ను శుభ్రపరిచే పనులు జరుగుతాయని స్పష్టం చేసింది. 

Also Read: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్.. మందుబాబులకు బిగ్ షాక్!

ఈ పనుల కొనసాగడం వల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పూర్తిగా అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్ల పాక్షికంగా అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. జనవరి ఉదయం 6 గంటల నుంచి జనవరి 12 ఉదయం 6 గంటల వరకు పారిశుద్ధ్య పనులు జరుగుతాయని చెప్పింది. నగరవాసులు తమకు సహకరించాలని కోరింది. 

Also read: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త

ముఖ్యంగా హుస్సేన్ సాగర్, కిషన్ బాగ్, దూబ్ బౌలి, మిస్రిగంజ్, పత్తెర్‌గట్టి, దర్-ఉల్-షిఫా, మోఘల్పురా, జహనుమ, చందులాల్ బరాదరి, ఫలక్‌నుమా, జంగంపేట్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడునుంది. అయితే ఈ ప్రాంతాల్లో ఉండేవారు నీటిని పొదుపుగా వాడుకోవాలని HMWSSB సూచించింది. 

Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు!

Also Read: అలా చేయడం లైంగిక వేధింపుతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు