Flight: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసే యత్నం.. చివరికి

సౌదీ అరేబియా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించాడు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. విమానం ల్యాండ్‌ అయ్యాక అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Indigo Flight

Indigo Flight

సౌదీ అరేబియా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో విమానంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించాడు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్‌పోర్టు అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.  అనంతరం పోలీసులకు అప్పగించారు. తాజాగా జరిగిన ఘటనతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఈ నెలలో రెండోసారి వార్తల్లో నిలిచింది.

Also Read: కాంగ్రెస్ అధిష్ఠానంపై అలిగిన మంత్రి ఉత్తమ్.. ఎందుకంటే ?

మార్చి 17న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఏషియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. సాంకేతిక సమస్యల వల్ల విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ నుంచి హైదరాబాద్‌కు విమానం వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.   

Also Read: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి 7 కొత్త రూల్స్.. లిస్ట్ ఇదే!

విమానం గాల్లో ఉన్నప్పుడు పైలట్‌ టెక్నికల్ సమస్యను గుర్తించారు. వెంటనే అప్రమత్తమై శంషాబాద్‌ ఏటీసీకి సమాచారం అందించారు. ఎమర్జేన్సీ ల్యాండింగ్‌కు అనుమతి రావడంతో ఫ్లైట్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో అప్పుడు విమానంలో 737 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు తాజాగా సౌదీ అరేబియా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించడం కలకలం రేపింది. 

Also Read: రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు బీజేపీ స్పెషల్ గిఫ్ట్

Also Read: భారతీయ గ్రీన్ కార్డుదారులకు ఇక చుక్కలు చూపించనున్న ట్రంప్ కొత్త పాలసీ విధానం!

rtv-news | telugu-news | airport | shamshabad | shamshabad-airport

 

Advertisment
Advertisment
తాజా కథనాలు