BIG BREAKING: ధరణి సేవలు బంద్‌

ధరణి పోర్టల్ సేవలు బంద్‌ అయ్యాయి. దీనికి సంబంధించి డేటాబేస్‌ వెర్షన్‌ అప్‌గ్రేడ్‌ అవుతోంది. డిసెంబర్ 12న సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు ఇది జరగనుంది. దీంతో నాలుగు రోజుల పాటు ధరణి సేవలు అందుబాటులో ఉండవు.

New Update
Dharani2

ధరణి పోర్టల్ సేవలు బంద్‌ అయ్యాయి. దీనికి సంబంధించి డేటాబేస్‌ వెర్షన్‌ అప్‌గ్రేడ్‌ అవుతోంది. డిసెంబర్ 12న (గురువారం) సాయంత్రం  5 గంటల నుంచి ప్రారంభమైన ఈ అప్‌గ్రేడేషన్ 16వ తేదీ (సోమవారం ) ఉదయానికి ముగియనుంది. దీంతో ఈ నాలుగు రోజుల పాటు ధరణి పోర్టల్ సేవలు అందుబాటులో ఉండవు. అప్‌గ్రేడేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ పోర్టల్ సేవలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. 

Also Read: తల దించుకోవాల్సి వస్తోంది.. పార్లమెంటులో నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

గత ప్రభుత్వం ధరణిలో అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందే తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌లో మార్పులు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే పోర్టల్‌లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇదిలాఉండగా.. ఇప్పటికే ధరణిలో ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు ప్రతీ దరఖాస్తును కలెక్టర్ మాత్రమే పరిష్కరించాల్సిన పరస్థితి ఉండేది. కానీ ఇకనుంచి తహశీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు కూడా ఈ పెండింగ్ సమస్యలు పరిష్కరించే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. 

Also Read: మంచు ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన సీపీ.. ఏడాదిపాటు బాండ్ ఓవర్!

ముందుగా అప్లికేషన్లను తహశీల్దార్‌కు పంపి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయిస్తున్నారు. ఆ తర్వాత దాన్ని ఆర్డీవో మళ్లీ పరిశీలిస్తారు. ఆ తర్వాత విచారణ రిపోర్టును జతచేసి అదనపు కలెక్టర్‌ను నివేదిస్తున్నారు. అయితే తహశీల్దార్, కలెక్టర్‌ అర్జీనీ వారం రోజుల్లోనే పరిష్కరించాలి, ఇక ఆర్డీవో, అదనపు కలెక్టర్లు మూడు రోజుల్లో పరిష్కరించేలా ప్రభుత్వం గడువు ఇచ్చింది. 

Also Read: ట్రంప్‌ బాధ్యతలు చేపట్టకముందే రాజీనామా చేస్తా: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌!

Also Read: మహిళలకు శుభవార్త.. నెలకు రూ.2,100 ఆర్థిక సాయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు