/rtv/media/media_files/2024/12/05/lMy8dQYPYpAxoGy39htU.jpg)
Harish Rao
Harish Rao: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్(Fee Reimbursement) చెల్లించకుండా విద్యార్థుల చదువును, వారి జీవితాలను కాంగ్రెస్ సర్కార్ ప్రశ్నార్థకం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తారు కానీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వారా అని ఆయన ప్రశ్నించారు. డిగ్రీకాలేజీలకు ఫిజు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పథకాన్ని ఎలాంటి మార్పు లేకుండా కేసీఆర్ అమలు చేసి గొప్ప మనసు చాటుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హాయంలో కరోనా వంటి ఆర్థిక సంక్షోభ కాలంలోనూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఆపలేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Cyber Crime : స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో మహిళకు టోకరా...రూ.2.7 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
డిగ్రీ కళాశాలలకు దాదాపు రూ. 800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచడంలో పడింది. డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనం. సకాలంలో పరీక్ష నిర్వహించకపోవడంతో పీజీసెట్, లా సెట్, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి మూడో సంవత్సరం విద్యార్థులు అర్హత కోల్పోతున్నారన్నారు. ఏప్రిల్ నెలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికీ నిర్వహించకపోవడం ప్రభుత్వ చేతగాని తనమే. మరోవైపు ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు డిగ్రీ పరీక్షలు నిర్వహించకుండా నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తున్నదని ఎద్దేవా చేశారు.ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. కళాశాల యాజమాన్యాలు అప్పులు తెచ్చి బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్న పరిస్థితి. అద్దెలు, అప్పులు పెరిగిపోవడంతో ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లను నిలిపివేయగా, కొన్నిచోట్ల కళాశాలలకు తాళం వేసి ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ఇంత జరుగుతుంటే తమకేమీ పట్టనట్లు సీఎం, మంత్రులు వ్యవహరిస్తుండడం సిగ్గుచేటు అని ఆయన విమర్శించారు.
ఇది కూడా చూడండి: High Court : నోటీసులిచ్చిన అక్రమ నిర్మాణాలను సీజ్ చేయండి.. GHMCకీ హైకోర్టు ఆదేశం
ప్రతి ఏటా సగటున రెండు వేల కోట్లు, తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో మొత్తం రూ.19 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేశాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 17 నెలల్లో 17 పైసలు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కింద విడుదల చేయలేదన్నారు. ఈ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో విద్య అనేది మిథ్య అని స్పష్టమవుతున్నది. యువ వికాసం పేరుతో ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో పెట్టారు. దానికి అతి గతి లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తామని మేనిఫెస్టోలో చెప్పి, పథకాన్ని మరుగునపడేలా చేశారన్నారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని మొన్న నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు గాలి మాటలే అయ్యాయన్నారు. రెండు నెలల్లో మొత్తం బకాయిలు క్లియర్ చేస్తామని, కళాశాల యాజమాన్యాలకు ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ఇచ్చిన హామీ నీటి మూటలే అయ్యాయి. మాటమీద నిలబడేది లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చేది లేదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరిదీ అదే దారి. ‘విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడం ఈ రేవంత్ అన్న బాధ్యత’ అంటూ స్పీచులు దంచే సీఎం.. ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు?అని హరీష్ రావు ప్రశ్నించారు.ఇప్పటికైనా కళ్ళు తెరిచి పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, తక్షణం డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థుల జీవితాలు అంధకారం కాకుండా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.’ అని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
ఇది కూడా చూడండి: వారికి సెలవులు క్యాన్సిల్ చేయండి.. యుద్ధ వాతావరణంవేళ ఆర్మీ కీలక ప్రకటన!
ఇది కూడా చూడండి: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?