/rtv/media/media_files/2025/04/27/3eb8pLe8FVhv4mR6jDrg.jpg)
CM Revanth shocking Decision on Maoist issue
Maoist: మావోయిస్టులపై కాల్పులు వెంటనే ఆపాలంటూ శాంతి చర్చల కమిటీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందించారు. ఈ అంశంపై జానారెడ్డి సలహాలు, సూచనలమేరకు నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు.
Also Read : బ్యాగ్లో బాంబ్- విమానంలో ‘అల్లా హు అక్బర్’ అంటూ భయపెట్టిన వ్యక్తి!
చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి ..
ఈ మేరకు ఆదివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో శాంతి చర్చల నేతలు సమావేశమయ్యారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ శాంతి చర్చల కమిటీ నేతలలు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు
అయితే ఈ అశంపై చర్చించిన సీఎం.. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుందని చెప్పారు. శాంతిభద్రతల అంశంగా పరిగణించదన్నారు. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని, ఈ అంశంపై జానారెడ్డి సలహాలు, సూచనలు తీసుకుని తమ నిర్ణయం వెల్లడిస్తామన్నారు.
Also Read: పాకిస్తాన్లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?
Also Read : క్రిమియాపై ఉక్రెయిన్ సంచలన కామెంట్స్..
cm revanth | telugu-news | today telugu news