Telangana: మందకృష్ణ నా కంటే వాళ్లనే ఎక్కవ నమ్ముతున్నారు.. రేవంత్ సీరియస్

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతో ఉన్న విభేదాలపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు.మందకృష్ణతో నాకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కానీ ఆయన తనకంటే ఎక్కువ ప్రధాని మోదీ, కిషన్‌రెడ్డిని నమ్ముతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

New Update
CM Revanth and Manda Krishna Madiga

CM Revanth and Manda Krishna Madiga

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతో ఉన్న విభేదాలపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. '' మందకృష్ణతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మా వ్యక్తిగత అనుబంధం బాగుంది. కానీ ఒక్క విషయంలో మాత్రం బాధగా ఉంది. మందకృష్ణ నాకంటే ఎక్కువ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డినే ఎక్కువగా నమ్ముతున్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం లేదు. 

Also Read: వెల్‌ కమ్‌ బ్యాక్‌.. క్రూ9 అంటూ పీఎం మోదీ, సునీతాకు వెల్‌కమ్ చెప్పిన ఇస్రో ఛైర్మన్

తెలంగాణ మాత్రమే ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం. ఎస్సీ వర్గీకరణను పక్కా ప్రణాళికతోనే అమలు చేయబోతున్నాం. ఈ అంశం కొలిక్కి వచ్చేదాకా ఎటువంటి నోటిఫికేషన్లు జారీ చేయొద్దని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశాము. రాహుల్ గాంధీ లేకుంటే వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే శక్తి నాకు వచ్చేది కాదు. రాబోయే రోజుల్లో దీనిపై న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉండకూడదని వన్‌ మెన్‌ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశాం.  

Also Read: దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా బీజేపీ నేత.. ఆస్తులెంతంటే ?

ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు ఇస్తున్నాం. ఇది ఎవరికీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. వర్గీకరణ చేపట్టి ఎస్సీలకు న్యాయం చేయాలనేదే మా ఉద్దేశం. గతంలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశాము. కానీ మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చేదాకా పోరాడామని'' సీఎం రేవంత్ అన్నారు. ఇదిలాఉండగా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

Also Read: ఈసీ ప్రతిపాదనతో మా వాదనకు మద్దతు..రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

Also Read: సునీతా విలయమ్స్ ఆరోగ్యంపై ఆందోళన.. మళ్లీ నడవాలంటే అది తప్పదా ?

Advertisment
Advertisment
తాజా కథనాలు