Chiru Family: సింగపూర్ కు బయలుదేరిన చిరంజీవి దంపతులు

చిరంజీవి దంపతులు అర్జంటుగా సింగపూర్ బయలుదేరి వెళ్ళారు. నిన్న మంటల్లో గాయపడిన పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్  చూసేందుకు నాన్నతో పాటూ పెదనాన్న కూడా వెళ్ళారు.

New Update
ts

Chiru Family

పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చదువుకుంటున్నాడు. ఈ స్కూల్‌లో అగ్నిప్రమాదం జరగడంతో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్‌ మన్యం పర్యటన తర్వాత సింగపూర్ వెళ్లారు. ఆ అబ్బాయి పరిస్థితి కాస్త సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం వలన చేతులకు, కాళ్ళకు గాయాలవ్వడమే కాక..ఊపిరితిత్తుల్లోకి పొగ కూడా వెళ్ళి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల దీర్ఘకాలికంగా సమస్యలు వస్తాయని అంటున్నారు.

ఎయిర్ పోర్ట్ లో చిరంజీవి దంపతులు..

ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. ఆయన తన కొడుకు చూసేందుకు సింగపూర్ వెళ్ళారు. అయితే పవన్ తో పాటూ అన్న చిరంజీవి, వదిన సురేఖ కూడా అక్కడకు బయలుదేరి వెళ్ళారు. హైదరాబాద్ విమానాశ్రయంలో పవన్, చిరంజీవి, సురేఖలు కనిపించారు. అక్కడకు వెళ్ళాక బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అవసరమైన, మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. కొడుకు పరిస్థితి బాగుపడే వరకూ పవన్ అక్కడే ఉండనున్నారు. 

 

today-latest-news-in-telugu | family | Pawan Kalyan | son

 

Also Read: TS: ముగిసిన శ్రవణ్ రావు విచారణ..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అడుగు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు