Kavitha: ఎమ్మెల్సీ కవిత ఫొటోలు మార్ఫింగ్.. బీజేపీ ఎంపీపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మార్ఫింగ్ ఫొటోలు నెట్టింట దర్శనమివ్వడం సంచలనంగా మారింది. పసుపు బోర్డు అంశంలో @AravindAnnaArmy అనే ఖాతా నుంచి షేర్ చేయగా బీఆర్ఎస్ మండిపడుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీజీ జాగృతి మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

New Update
kavitha mlc nzbd

BRS MLC Kavitha morphing photos issue

Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడం సంచలనంగా మారింది. పసుపు బోర్డు విషయంలో బీజేపీ నిజమాబాద్ ఎంపీ అర్వింద్ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఈ ఫొటోలు షేర్ చేసినట్లు గుర్తించిన బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. @AravindAnnaArmy అనే హ్యాండిల్‌తో పాటు దీని వెనకాల ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ జాగృతి మహిళా విభాగం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

mlc kavitha issue
mlc kavitha issue

 

 సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..

ఈ మేరకు సోమవారం నాడు మేడ్చల్ జిల్లా తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు, కార్పొరేటర్ లలిత యాదవ్ ఆధ్వర్యంలో పలువురు సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. ఫోటోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. 

mlc kavitha pics morphing issue
mlc kavitha pics morphing issue

 

ఇది కూడా చదవండి: Honey trap: టీ కోసం ఇంటికి పిలిచి.. బట్టలిప్పి టెంప్ట్ చేసి: హనీట్రాప్ ముఠా గుట్టురట్టు!

ఒక రాజకీయ పార్టీ సంబంధించిన కీలక నాయకుడి ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అసత్య ప్రచారాలు చేస్తుండడమే కాకుండా ఫోటోను మార్ఫింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో జాగృతి నాయకులు వాసగొని శోభ గౌడ్, బండారి లావణ్య, స్వప్న రెడ్డి, సింగిరెడ్డి విమల రెడ్డి, శ్రీలత, మహేశ్వరి, రత్న, పెంటమ్మ, తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad: గవర్నర్‌ ప్రతిభా పురస్కారాలను ప్రకటించిన రాజ్‌భవన్‌.. లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు