Kavita: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసింది: కవిత

క్రిస్మస్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మెదక్‌ చర్చిని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు నెలకు రూ.2,500, కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు.

New Update
MLC Kavita

MLC Kavita

క్రిస్మస్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మెదక్‌ చర్చిని సందర్శించారు. ఈ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. '' కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీలు ఆగిపోయాయి.  మహిళలకు నెలకు రూ.2,500, కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం సీఎం అందిస్తారని మహిళలు ఆశించారు. కానీ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయడం లేదు.  

ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం రూ.30 వేలు బాకీ పడింది.18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వలేదు. రేవంత్ ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసింది. తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి. కేసీఆర్ కిట్ పథకాన్ని నిలిపివేయడం దారుణం. రాష్ట్రంలో 40 శాతం నేరాలు పెరిగాయి. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరగడం మహిళల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసే సోయి ప్రభుత్వానికి లేదు. 

Also Read: త్వరలో ఢిల్లీ సీఎం అరెస్ట్.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన!

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొట్టింది. తక్షణమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలి. రైతు భరోసా కింద అర్హులను తగ్గించే ప్రయత్నం చేయవద్దు. కేంద్ర ప్రభుత్వపు నిబంధలను అమలు చేస్తే 30 శాతం రైతులకు కూడా రైతు భరోసా రాదు. ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు దాన్ని కేవలం సన్న వడ్లకే పరిమితం చేసింది. మొక్కజొన్నలు, కందులు, సోయాబీన్, పత్తి వంటి పంటలకు మద్ధతు ధరను పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైంది ? 

షుగర్ ఫ్యాక్టరీలను ఎప్పుడు తెరిపిస్తారు ?. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సిందే. తక్షణమే రేషన్ కార్డులను, రైతు భరోసా ఇవ్వాలి. తెలంగాణకు తలమానికం మెదక్ చర్చి. కేసీఆర్‌కు క్రైస్తవులకు పేగుబంధం ఉంది. తెలంగాణ కోసం ప్రార్థన చేయని చర్చి లేదు. మెదక్ జిల్లాను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు. గోదావరి జలాలతో సింగూరును నింపారు. మెదక్‌కు నీళ్లు వచ్చే కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను ప్రభుత్వం నిలిపివేడయం దారుణం. కేసీఆర్‌పై కోపాన్ని మెదక్ ప్రజలపై తీర్చుకుంటే ఏమొస్తుంది?. కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను కొనసాగించాలని'' కవిత అన్నారు. 

Also Read: ఇలా తింటున్నారేంట్రా బాబు.. ప్రతి సెకన్‌కు 2 బిర్యానీలు ఆర్డర్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు