HCU భూముల అమ్మకం కుదరదు.. సీఎం రేవంత్ కు కేంద్రం షాక్!

కంచె గచ్చిబౌలిలోని భూములు అమ్మడం కుదరదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరన్నారు. ఇలా చెట్లను నరికివేయవద్దని సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు. తక్షణమే భూముల అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు.

New Update

కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిదన్నారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందన్నారు. వట ఫౌండేషన్‌ అనే NGO దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు.
ఇది కూడా చదవండి: HCUలో హైటెన్షన్.. స్టూడెంట్స్ Vs పోలీస్.. కేటీఆర్, హరీష్ అరెస్ట్!

ఆ భూముల వేలం కుదరదు..

కంచె గచ్చిబౌలి భూములను వేలం వేయడం కుదరదన్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందన్నారు. చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. 
ఇది కూడా చదవండి: HCA వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా? అని ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు. తక్షణమే గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. 

( Bandi Sanjay | telugu-news | telugu breaking news | revanth-reddy | HCU Land Dispute)

Advertisment
Advertisment
తాజా కథనాలు