/rtv/media/media_files/2025/04/14/4pLD8IniUNqXXiixLDus.jpg)
BRS MLA Padi Kaushik Reddy
Padi Kaushik Reddy : బీఆర్ఎస్ నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి కోర్టు భారీ ఊరటనిచ్చింది. క్వారీ యజమానిని బెదిరించి రూ.50 లక్షలు డిమాండ్ చేసిన ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆయనకు ఖాజీపేట రైల్వేకోర్టు మొదట 14 రోజలు రిమాండ్ విధించింది. అయితే ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల హుజురాబాద్ నియోజకవర్గం వంగపల్లికి కి చెందిన గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డిని కౌశిక్ రెడ్డి బెదిరించాడు. రూ.50లక్షలు ఇవ్వాలని అతన్ని డిమాండ్ చేశారు. రూ.25 లక్షలు ఇచ్చినప్పటికీ మరో రూ.25 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు.
ఇది కూడా చదవండి: యోగాసనాలు మహిళలకు ఓ వరం.. రోజూ చేస్తే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు
దీనిపై బాధితుని భార్య వరంగల్ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఏప్రిల్ 21వ తేదీన కౌషిక్ రెడ్డిపై 308(2), 308(4), 308(5) 352 BNS సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయితే దీనిపై కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ నెల 18న హైకోర్టు ఆ కేసును కొట్టివేయడంతో శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్టులో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి నేరుగా హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య కాజీపేటలోని రైల్వే కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు ముందు రిమాండ్ విధించి.. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో బీఆర్ఎస్ నేతలు ఊపిరిపీల్చుకున్నారు.
Also Read: డైరెక్టర్ మిస్సింగ్ మిస్టరీ.. విషాదం మిగిల్చిన విమాన ప్రమాదం